‘కరోనా’ జంతువును మన దేశంలోనూ తింటారట.. ఎక్కడో తెలుసా.!

|

May 04, 2020 | 11:05 AM

చిత్ర విచిత్రమైన పోకడులు, వింత ఆహారపు అలవాట్లకు పెట్టింది పేరు చైనా. అక్కడ బొద్దింకలు, గబ్బిలాలు, పాములు, క్రిమి కీటకాలు… ఇలా ఒకటేమిటి ఇలాంటి చెత్తా చెదారాలను ఎన్నో తింటుంటారు. ఇక దీని వల్లే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది. చైనాలోని వుహన్ నగరంలో మొదటిసారిగా గుర్తించిన ఈ వైరస్ గబ్బిలాల ద్వారా సోకిందన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇదిలా ఉంటే గబ్బిలాలను చైనాలో మాత్రమే కాకుండా ఇండియాలో కూడా […]

కరోనా జంతువును మన దేశంలోనూ తింటారట.. ఎక్కడో తెలుసా.!
Follow us on

చిత్ర విచిత్రమైన పోకడులు, వింత ఆహారపు అలవాట్లకు పెట్టింది పేరు చైనా. అక్కడ బొద్దింకలు, గబ్బిలాలు, పాములు, క్రిమి కీటకాలు… ఇలా ఒకటేమిటి ఇలాంటి చెత్తా చెదారాలను ఎన్నో తింటుంటారు. ఇక దీని వల్లే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది. చైనాలోని వుహన్ నగరంలో మొదటిసారిగా గుర్తించిన ఈ వైరస్ గబ్బిలాల ద్వారా సోకిందన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది.

ఇదిలా ఉంటే గబ్బిలాలను చైనాలో మాత్రమే కాకుండా ఇండియాలో కూడా ఒక ప్రాంతంలో తింటారని తెలుస్తోంది. నాగాలాండ్‌లోని మిమి అనే ప్రాంతంలో ప్రతీ ఏటా ఓ విచిత్రమైన పండగ జరుగుతుందట. ఇక ఆ సమయంలో ప్రత్యేకంగా గబ్బిలాలనే తింటారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ ప్రాంతంలో నివసిస్తున్న జనానికి పూర్వకాలం నుంచి గబ్బిలాలను తినడం ఆనవాయితీగా వస్తోందట. ఏడాదిలో ఒకసారి గబ్బిలం మాంసం తింటే ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటామని మిమి ప్రాంతవాసులు భావిస్తారని తెలుస్తోంది. అందుకే గబ్బిలాలను తినడం కోసమే ప్రత్యేకంగా ఓ పండుగను మొదలు పెట్టారట. అయితే వీరు మాత్రం చైనావాసులు మాదిరిగా కాకుండా మాంసాన్ని కూరగా వండుకుని తింటారట. ఏది ఏమైనా కరోనా వల్ల గబ్బిలాల పేరు వింటేనే చాలు అందరూ భయపడుతున్నారు.

Read More: 

తెలంగాణలో మే 21 వరకు లాక్‌డౌన్‌..?

జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం..

నేటి నుంచి ఏపీలో మద్యం షాపులు ఓపెన్.. టైమింగ్స్ ఇవే..

వారిని మాత్రమే తరలించాలి.. కేంద్రం క్లారిటీ..

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 3.0.. తెరుచుకునేవి ఇవే..

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. దేశంలో కరోనా కేసులు ఎన్నంటే…