మా “ఎమ్మెల్యే, ఎంపీ”ల ఆచూకీ చెప్పండి.. క్యాష్ గెలుచుకోండి..!

| Edited By:

May 19, 2020 | 5:40 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలతో పాటుగా.. కింది స్థాయి నేతలు కూడా ప్రజలకు ధైర్యం చెప్తూ.. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లో మాత్రం ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే మాత్రం ప్రజలకు కనిపించకుండా పోయారట. ఇది చెప్పింది ఎవరో కాదు.. వాళ్ల నియోజక వర్గ ప్రజలే. అంతేకాదు.. తమ ఎమ్మెల్యే, ఎంపీల ఆచూకీ చెప్తే.. రూ.21000/- క్యాష్ కూడా రివార్డ్‌ ఇస్తాం అంటూ వాల్ […]

మా ఎమ్మెల్యే, ఎంపీల ఆచూకీ చెప్పండి.. క్యాష్ గెలుచుకోండి..!
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలతో పాటుగా.. కింది స్థాయి నేతలు కూడా ప్రజలకు ధైర్యం చెప్తూ.. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లో మాత్రం ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే మాత్రం ప్రజలకు కనిపించకుండా పోయారట. ఇది చెప్పింది ఎవరో కాదు.. వాళ్ల నియోజక వర్గ ప్రజలే. అంతేకాదు.. తమ ఎమ్మెల్యే, ఎంపీల ఆచూకీ చెప్తే.. రూ.21000/- క్యాష్ కూడా రివార్డ్‌ ఇస్తాం అంటూ వాల్ పోస్టర్లు అతికించారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే, ఎంపీలు మరెవరో కాదు.. సాక్షాత్తు మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్, ఆయన కుమారుడు ఎంపీ నకుల్ నాథ్‌. వీరిద్దరు లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ.. స్థానిక చింద్వారా నియోజకవర్గ ప్రజలకు కనిపించకుండా పోయారని.. అక్కడి స్థానికులు కొందరు ఆరోపిస్తూ.. వారికి సంబంధించిన వాల్‌పోస్టర్‌లను అతికించారు. అయితే ఈ పోస్టర్లను అధికార బీజేపీకి చెందిన కొందరు కావాలనే అతికించి ఉంటారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అయితే ఈ పోస్టర్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ స్పష్టం చేసింది.