బీజేపీ చీఫ్కు ట్విట్టర్ వేదికగా చురకలంటించిన హరీష్రావు
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాపై తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శలుగుప్పించారు. మానవాళిక పెను సవాల్ విసురుతున్నకరోనా వైరస్ విషయంలో రాజకీయాలు చేయడం కరెక్టేనా అంటూ..

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాపై తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శలుగుప్పించారు. మానవాళిక పెను సవాల్ విసురుతున్నకరోనా వైరస్ విషయంలో రాజకీయాలు చేయడం కరెక్టేనా అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. దేశ రక్షణ విషయంలో విమర్శలు చేయడం ద్వారా.. సైన్యం ఆత్మస్థైర్యం కోల్పోతుందన్న మీరు.. కరోనా పరీక్షల విషయంలో రాష్ట్రాలపై ఆరోపణలు చేయడం సరైందేనా అంటూ ప్రశ్నించారు. వైద్యులు చేస్తున్న కృషిని తక్కువ చేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటూ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. ప్రస్తుతం కరోనా విషయంలో రాజకీయాలు చేస్తే.. దేశ భద్రత విషయంలో చులకనగా మాట్లాడటంతో సమానమని హరీష్ రావ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా.. మానవాళి మనుగడకే సవాలుగా మారిన కరోన విషయంలో రాజకీయాలు చేయడం దేశ భద్రత విషయంలో చులకనగా మాట్లడడంతో సమానం. దయచేసి ఇది గుర్తుంచుకోవాలని బిజేపి జాతీయ అధ్యక్షుడు @JPNadda గారిని కోరుతున్నా
— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) June 21, 2020
సైనికుల నైతికస్థైర్యం దెబ్బతీస్తుందని ఉద్బోదిస్తారు. మరి కరోనా విషయంలో రాష్ట్రాలను విమర్శించడం రాజనీతి అవుతుందా? దేశానికి వైద్యశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంఉన్న మీరే వైద్యులు చేస్తున్నకృషిని తక్కువ చేసి చూపడం సబబా? ఇది వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసే చర్య కాదా? @JPNadda గారు
— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) June 21, 2020
@JPNadda గారు.. సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులు, ప్రాణాలకు లెక్క చేయకుండా కరోనా పై పోరాడుతున్న వైద్యులు ఒక్కటే అని కదా మనం అనుకుంటున్నది. ప్రధాన మంత్రి మోడీ గారు కూడా అదే కదా చెప్తున్నారు. దేశ రక్షణ విషంలో ప్రభుత్వాలపై విమర్శలు చేయడం అనుచితం కాదని మీరే అంటారు
— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) June 21, 2020



