డైరెక్టర్ మణిరత్నం డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన ప్రస్తుతం తీస్తున్న భారీ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ను డైరెక్ట్ చేస్తున్నారు. కరోనా ప్రభావంతో చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ సినిమా తర్వాత మణిరత్నం డిజిటల్ రంగంలోకి ఓ వెబ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని కోలీవుడ్ వర్గాల అంటున్నాయి. ఇప్పటికే మణిరత్నం కాన్సెప్ట్ను సిద్ధం చేశారట. ఈ వెబ్సిరీస్కు మణిరత్నం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాడట. అయితే తన దర్శకత్వ శాఖ పనిచేసే ఒకరికి డైరెక్షన్ బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.