కరోనా కట్టడికి కేంద్రం ప్రకటించిన లాక్డౌన్కు నేటితో 50 రోజులు అయ్యింది. దేశమంతా మార్చి 24 అర్ధరాత్రి నుంచి ఏప్రిల్14 వరకు లాక్డౌన్ అమల్లోకి వస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. అనంతరం మే 3 వరకు లాక్డౌన్ పొడిగించారు. ఆ తర్వాత మే 17 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ప్రకటించింది. నిన్న జాతిని ఉద్దేశించి మరోమారు ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ మే 18 నుంచి 4వ దశ లాక్డౌన్ మొదలు కానున్నట్లు తెలిపారు. కానీ, ఈ సారి లాక్డౌన్లో అనేక సడలింపులు ఉంటాయని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే రవాణా వ్యవస్థలోనూ వెసులుబాటు ఉంటుందని చెప్పారు. కానీ, అక్కడి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం మాత్రం ఇప్పుడప్పుడే తమ బస్సులను నడపబోయేది లేదని చెబుతున్నాయి.