Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా టెర్రర్.. ఒమిక్రాన్‌తో పరేషాన్.. వివిధ దేశాల్లో కేసుల వివరాలు

|

Jan 07, 2022 | 9:04 PM

ప్రపంచవ్యాప్తంగా ఉరిమే వేగంతో ఒమిక్రాన్‌ వైరస్‌ విస్తరిస్తోంది. కేసుల సంఖ్య 30 కోట్లు దాటింది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 26 లక్షల కేసులు వచ్చాయి. అమెరికా, ఫ్రాన్స్​, ఇటలీ, భారత్, అర్జెంటీనా వంటి దేశాల్లో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది.

Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా టెర్రర్.. ఒమిక్రాన్‌తో పరేషాన్.. వివిధ దేశాల్లో కేసుల వివరాలు
Coronavirus
Follow us on

కరోనా వైరస్‌ ముడేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది ఈ మహమ్మారి. పలు దేశాల్లో పలు రూపాలు మారుస్తూ తన ప్రతాపాన్ని చూపిస్తూ లక్షల మందిని బలితీసుకుంటోంది. కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​​విజృంభణతో దాదాపు అన్ని దేశాల్లో వైరస్​ బారినపడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 25,19,837 మందికి వైరస్​ సోకింది. 7వేల 214 మంది బలయ్యారు. 6లక్షల 89వేల మంది వైరస్​ను జయించారు. మొత్తం మరణాల సంఖ్య 54 లక్షల 89వేల 506కు చేరింది. అమెరికాలో వైరస్​ విలయం కొనసాగుతోంది. శుక్రవారం మరో 7లక్షల 27వేల 863 మందికి వైరస్​పాజిటివ్‌గా తేలింది. 1843 మంది చనిపోయారు. 89వేల మంది వైరస్‌ను జయించారు. మొత్తం కేసుల సంఖ్య 6కోట్ల 2 లక్షల 91 వేల 979, మరణాలు 8లక్షల 55వేల 843కు చేరాయి. ఒమిక్రాన్​ వేరియంట్​ కేసులే 95 శాతం మేర ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త కేసులతో ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం లక్షకు పైగా చికిత్సపొందుతున్నట్లు అంచనా.

ఫ్రాన్స్‌లో ఒమిక్రాన్​ సహా మరో కొత్త వేరియంట్ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. డెల్టా, ఒమిక్రాన్​కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 2లక్షల 61 వేల 481 కేసులు బయటపడ్డాయి. 204 మంది చనిపోయారు. 57వేల మంది వైరస్‌ను జయించగా.. మొత్తం కేసులు కోటి 11 లక్షల 83వేల 238.. చనిపోయిన వారు లక్షా 25వేల 13కు చేరింది. ఇటలీలో కొత్తగా 2లక్షల 19వేల కేసులు వచ్చాయి. 198 మంది ప్రాణాలు కోల్పోయారు. 46వేల మంది వైరస్​ నుంచి కోలుకోగా.. మొత్తం కేసుల సంఖ్య 69లక్షల 75 వేల 465కు చేరింది. మొత్తం 1,14, 207 మంది మరణించారు. బ్రిటన్‌లోనూ కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్క రోజే లక్షా 79వేల 756 మందికి వైరస్​ సోకింది. 231 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 40 లక్షలు దాటింది. అర్జెంటీనాలోనూ వైరస్​ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా లక్షా 9వేల 608 కేసులు బయటపడ్డాయి. 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 36వేల మంది కోలుకోగా.. మొత్తం కేసుల సంఖ్య 6లక్షల 25వేల 303కు చేరింది.

Also Read: ఏపీ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ప్రకటించిన జగన్ సర్కార్.. మరో గుడ్ న్యూస్

Andhra Pradesh: ఏపీలో స్కూళ్లకు, జానియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవే.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..?