కరోనా ఎఫెక్ట్‌తో.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

| Edited By:

Mar 18, 2020 | 4:16 PM

కరోనా ఎఫెక్ట్‌తో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మన దేశంలో విజృంభిస్తోన్న కరోనాను కట్టడి చేయటానికి కేంద్రం పలు చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసందే. ఇప్పుడు తాజగా మరో నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్న భారతీయులపై నిషేధం..

కరోనా ఎఫెక్ట్‌తో.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం
Follow us on

కరోనా ఎఫెక్ట్‌తో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మన దేశంలో విజృంభిస్తోన్న కరోనాను కట్టడి చేయటానికి కేంద్రం పలు చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజగా మరో నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్న భారతీయులపై కేంద్రం నిషేధం విధించింది. ప్రవాస భారతీయులు దేశంలో అడుగుపెట్టకుండా చేసింది. ఈ నిషేధం మార్చి 31వ తేదీ వరకూ అమలులో ఉండనుందని పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ తెలిపారు.

కాగా.. ఇప్పటికే మనదేశంలో 138 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 14 మంది విముక్తి పొందగా, ముగ్గురు మరణించారు. దీంతో సోమవారం నాటికి 120 మంది ఉన్నారు. అయితే.. మంగళవారం ఒక్క రోజే 18 కేసులు నమోదు కావడంతో.. మరలా 138కి కేసుల సంఖ్య చేరుకుంది. దీంతో.. విదేశీయులనే కాకుండా.. ప్రవాస భారతీయులను కూడా ఇండియాకి రాకుండా ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం. ఇక అత్యవసరం ఉన్నవారికి కరోనా టెస్టులు నిర్వహించి.. నెగిటివ్ అని తేలితేనే అనుమతిస్తారని సమాచారం. అలాగే.. గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు వచ్చేవారికి 14 రోజుల పాటు క్వారంటైన్‌ను తప్పనిసరి చేసింది.

Read More this also:

‘చంద్రబాబు మృతి’ అంటూ వల్గర్ పోస్టులు.. మంగళగిరిలో కేసులు

హీరోయిన్‌ నమితకు చేదు అనుభవం.. పోర్న్ వీడియోలు బయటపెడతానంటూ..

దొరబాబు విషయంలో.. హైపర్ ఆది కీలక నిర్ణయం! 

ఇంటింటికి ఉచితంగా కిలో చికెన్ సప్లై.. గారెలతో కలిపి