ఇంటింటికి ఉచితంగా కిలో చికెన్ సప్లై.. గారెలతో కలిపి
కరోనా వైరస్ కారణంగా కృష్ణా జిల్లా పౌల్ట్రీ వ్యాపారులకు కొన్ని రోజులుగా నష్టాలు వెంటాడుతున్నాయి. దీంతో ప్రజలలో చికెన్ తింటే కరోనా వైరస్ సోకదన్న అవగాహన కల్పించడానికి చికెన్ను ఉచితంగా అందచేయాలని..
కరోనా వైరస్ కారణంగా కృష్ణా జిల్లా పౌల్ట్రీ వ్యాపారులకు కొన్ని రోజులుగా నష్టాలు వెంటాడుతున్నాయి. దీంతో ప్రజలలో చికెన్ తింటే కరోనా వైరస్ సోకదన్న అవగాహన కల్పించడానికి.. చికెన్ను ఉచితంగా అందచేయాలని వారు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే గూదురు మండలం గండ్రమ్ గ్రామంలో.. ఆర్జేడీ సాయి గణేశ్ చికెన్ వ్యాపారులు.. చికెన్ కర్రీ వండి స్థానికులకు గారెలతో కలిపి టిఫిన్ పెట్టించారు. అంతే కాకుండా గ్రామంలోని ప్రతి ఇంటికి ఒక్కో కిలో చొప్పున కోడి మాంసాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. చికెన్ తింటే కరోనా రాదని ప్రభుత్వం ఇచ్చిన లేఖను కూడా ప్రజలకు చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఇలాగైనా ప్రజలలో నెలకొన్న అపోహ పోతుందని భావిస్తున్నామని పౌల్ట్రీ వ్యాపారులు పేర్కొంటున్నారు. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్న పౌల్ట్రీ పరిశ్రమ కుదుట పడుతుందన్న ఆలోచనతోనే ఇలా చేస్తున్నామంటున్నారు వారు తెలిపారు.
Read More this also: దారుణంగా పడిపోయిన టమాటా ధరలు.. పదికి 3 కిలోలు
శివగామి పాత్ర చేసినందుకు ఫీల్ అవుతోన్న రమ్య
సీఎం జగన్పై నాగబాబు సెటైర్స్!
సిల్వర్ స్క్రీన్పై ‘కరోనా’ మూవీ
అవకాశం కోసం వెళ్తే.. ఓ నిర్మాత పడకగదికి రమ్మన్నాడు: హీరోయిన్ సంచలన కామెంట్స్..