AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్భుత దృశ్యం.. దేశవ్యాప్తంగా కరోనా వారియర్స్‌పై పూలవర్షం..

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో దేశ త్రివిధ దళాలు ఇవాళ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాయి. శ్రీనగర్ నుంచి కేరళలోని తిరువనంతపురం, అసోంలోని దిబ్రూగర్ నుంచి గుజరాత్‌లోని..

అద్భుత దృశ్యం.. దేశవ్యాప్తంగా కరోనా వారియర్స్‌పై పూలవర్షం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 03, 2020 | 10:31 AM

Share

దేశంలో కరోనా వైరస్‌ అంతకంతకూ విస్తరిస్తోంది. అయితే దానికి కట్టడి చేసేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ఇలా అందరూ అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారి శ్రమకు తగినట్టు ఎన్ని పాజిటివ్‌ కేసులు పెరిగినా వైద్య సిబ్బంది అందిస్తున్న సేవల కారణంగా కరోనా బాధితులు సంపూర్ణంగా కోలుకుని ఇళ్లకు వెళుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో దేశ త్రివిధ దళాలు ఇవాళ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాయి. శ్రీనగర్ నుంచి కేరళలోని తిరువనంతపురం, అసోంలోని దిబ్రూగర్ నుంచి గుజరాత్‌లోని కచ్ వరకు చక్కర్లు కొడుతూ చాలా ప్రాంతాల్లో పూలు చల్లుతున్నాయి. ఇక అలాగే గాంధీ ఆసుపత్రిలో వైద్య సేవలను అందిస్తున్న వైద్యులు, సిబ్బందిపై పూలవర్షం కురిపించింది భారత వాయుసేన. ఇక సాయంత్రం దేశ తీరాల్లో యుద్ద నౌకలపై దీపాలు వెలిగిస్తారు. నేవీ హెలీకాఫ్టర్లు ఆకాశం నుంచి కోవిడ్ ఆస్పత్రిలుపై పూలు చల్లుతాయి. కోవిడ్ వారియర్స్‌కు సంఘీభావంగా ఆర్మీ మౌంటెయిన్ బ్యాండ్ మోగిస్తారు. అలాగే పోలీస్ స్మారకాల దగ్గర శ్రద్ధాంజలి ఘటిస్తారు.

Read More:

గుడ్‌న్యూస్: ఉద్యోగులకు, వ్యాపారులకు ‘కరోనా లోన్’

బాలీవుడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ.. ప్రముఖ దర్శకుడితో సినిమా!