తబ్లీగ్ సభ్యులకు నోటీసులు

|

May 23, 2020 | 10:35 AM

ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ సమావేశంలో పాల్గొన్న విదేశీయులకు మరోసారి నోటీసులిచ్చారు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు. వారిని సీఆర్ పీసీ సెక్షన్ 41 ఎ కింద ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించనున్నారు.

తబ్లీగ్ సభ్యులకు నోటీసులు
Follow us on

ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ సమావేశంలో పాల్గొన్న విదేశీయులకు మరోసారి నోటీసులిచ్చారు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు. వారిని సీఆర్ పీసీ సెక్షన్ 41 ఎ కింద ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఢిల్లీలో కరోనా వ్యాప్తికి కారణమయ్యారని ఇందులో పేర్కొన్నారు. విదేశాలకు చెందిన జమాత్ సభ్యులు గత నెల రోజులుగా క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. వీరితోపాటు దేశంలో 1900 మంది తబ్లీగ్ జమాత్ సభ్యులకు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ఇందులో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన తబ్లీగ్ సభ్యులు కూడా ఉన్నారు. ఇదిలావుంటే.. ఆ సంస్థ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్‌ పాస్ పోర్టును రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఢిల్లీ పోలీసులు.