ఆర్థిక వ్యవస్థపై కరోనా దాడి… నష్టం 11 ట్రిలియన్ డాలర్లు… ప్రభావం పదేళ్ల పాటు….

| Edited By:

Dec 09, 2020 | 4:46 PM

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దాదాపు 11.5 ట్రిలియన్ డాలర్లు నష్టపోయిందని 17 మందితో కూడిన ఆర్థిక, వైద్య రంగ నిపుణుల బృందం తాజాగా  ఒక సర్వే ఫలితాలను విడుదల చేసింది.

ఆర్థిక వ్యవస్థపై కరోనా దాడి... నష్టం 11 ట్రిలియన్ డాలర్లు... ప్రభావం పదేళ్ల పాటు....
Follow us on

Covid may cost global economy $11 trillion: Study  కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ‌పై పడిన భారమెంతో తెలుసా… గతంలో ప్రపంచ అభివృద్ధికి ఆటంకం కలిగించిన వ్యాధులెంటో తెలుసా.. ఇప్పడు ప్రపంచాన్ని పట్టపీడిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా… గతంలో వచ్చిన అతిపెద్ద వ్యాధుల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొన్న నష్టాలు ఎంతో తెలుసా…

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దాదాపు 11.5 ట్రిలియన్ డాలర్లు నష్టపోయిందని 17 మందితో కూడిన ఆర్థిక, వైద్య రంగ నిపుణుల బృందం తాజాగా  ఒక సర్వే ఫలితాలను విడుదల చేసింది. రానున్న 10 ఏళ్లలో 260 బిలియన్ డాలర్ల నష్టాన్ని ప్రపంచం చవిచూడబోతోందని పేర్కొంది. కాగా, ఆ నష్టం ప్రస్తుతం సంభవించిన నష్టంలో కేవలం రెండు శాతమేనని తెలిపింది. అన్ని దేశాలు కలిపి 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీని కోల్పోతారని విశ్లేషించింది.

వైద్య ఖర్చులు పెరిగిపోవడం, నిరుద్యోగం, ద్రవ్యోల్భణం, మరణాలు కారణంగా జీడీపీ పడిపోతాయని ఆర్థిక రంగ నిపుణుల బృందం తెలిపింది. అయితే గతంలో వచ్చిన హెచ్1ఎన్1 వైరస్, ఎయిడ్స్ వ్యాధులు సైతం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్నే చూపాయని పేర్కొంది. ఈ కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థపై నుంచి పోవాలంటే దాదాపు దశాబ్ద కాలం పడుతుందని తెలిపింది.