క్వారంటైన్ రూల్స్ బ్రేక్‌చేసిన 6 నెల‌ల‌ ప‌సికందు, రెండేళ్ల‌ చిన్నారిపై కేసు న‌మోదు !

|

Apr 26, 2020 | 2:20 PM

దేశంలోని అన్ని రాష్ట్రాలలో లాక్‌డౌన్‌, క్వారంటైన్‌ రూల్స్ ను కట్తుదిట్టం చేసారు. ఇళ్ల నుండి ఎవరు బయటకి రావొద్దు అని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.

క్వారంటైన్ రూల్స్ బ్రేక్‌చేసిన 6 నెల‌ల‌ ప‌సికందు, రెండేళ్ల‌ చిన్నారిపై కేసు న‌మోదు !
Follow us on
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండగా.. గడచిన 24 గంటల్లో పాజిటివ్ కేసులు మరో మైలురాయికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా 1,715 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26వేలు దాటింది.  ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలలో లాక్‌డౌన్‌, క్వారంటైన్‌ రూల్స్ ను కట్తుదిట్టం చేసారు. ఇళ్ల నుండి ఎవరు బయటకి రావొద్దు అని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అయితే కొంతమంది లాక్ డౌన్ నియమాలని పట్టించుకోవడం లేదు. అటువంటి వారిపై పోలీసులు కేసులు న‌మోదు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో 6 నెల‌ల ప‌సికందు, రెండేళ్ల‌ చిన్నారిపై కేసు న‌మోదు చేశారు ఉత్త‌రాఖండ్ పోలీసులు. వివ‌రాల్లోకి వెళితే..

ఉత్త‌రాఖండ్  ఉత్తర కాశీ జిల్లాలోని రెవెన్యూ పోలీసులు క్వారంటైన్ నిబంధనల ఉల్లంఘన కింద మొత్తం 51 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో పసికందు రెండేళ్ల పిల్లాడు కూడా ఉన్నారు. పసిబిడ్డలపై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఉత్తరకాశి జిల్లా మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద 8 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారిపై FIR నమోదు చేయరాదు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని మేజిస్ట్రేట్ తెలిపింది. బాలలపై జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు   చేసిన జిల్లా మేజిస్ట్రేట్ పై క్రమశిక్షణ సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని డీఎం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నివేదికను కూడా డీఎం కోరారు. ఉత్తరాఖండ్ లో మొత్తం కరోనా కేసులు 47 నమోదు కాగా 24మంది కరోనా బాధితులు ఇప్పటివరకు కోలుకున్నారు.