దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులను ఆందోళకు గురి చేస్తోంది. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 32 మంది కరోనాతో మరణించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 149కి చేరింది. అలాగే నిన్నటి నుంచి ఇప్పటివరకూ 773 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 5,274గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. 411 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
తెలంగాణ ప్రభుత్వానికి.. ‘మొగలి రేకులు’ ఫేమ్ ఆర్కే నాయుడు విరాళం
ఏప్రిల్ 11న ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. సీఎంలతో మరోసారి కాన్ఫరెన్స్
హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొడుతున్న ‘కరోనా కారు’
తెలంగాణలో హాట్ స్పాట్లుగా వంద ప్రదేశాలు.. మరింత కట్టుదిట్టం