హెడ్ కానిస్టేబుల్‌కు క్లాస్ పీకిన వైసీపీ ఎమ్మెల్యే

ఓ హెడ్ కానిస్టేబుల్‌కు క్లాస్ పీకారు చిలకలూరి వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినీ. ఇలాంటి వాళ్ల వల్ల వైసీపీ ప్రభుత్వానికి మచ్చ వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న చిలకలూరిపేట ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్..

హెడ్ కానిస్టేబుల్‌కు క్లాస్ పీకిన వైసీపీ ఎమ్మెల్యే
Follow us

| Edited By:

Updated on: Apr 08, 2020 | 4:01 PM

ఓ హెడ్ కానిస్టేబుల్‌కు క్లాస్ పీకారు చిలకలూరి వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినీ. ఇలాంటి వాళ్ల వల్ల వైసీపీ ప్రభుత్వానికి మచ్చ వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న చిలకలూరిపేట ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ రాం ప్రసాద్ లంచం డిమాండ్ చేస్తున్న ఆడియోలు తన దృష్టికి రావడంతో ఆమె  మంగళవారం ఎక్సైజ్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కంచే చేను మేసినట్లుగా.. ఎక్సైజ్ సిబ్బందే లంచాలు తీసుకుంటే దారుణమన్నారు. ఇది చాలా పెద్ద విషయమని, ఆ అవినీతి అధికారి ఎవరో తెలుసుకోడానికి తాను ఇక్కడిదాకా రావాల్సి వచ్చిందన్నారు.

అక్రమంగా మద్యం అమ్మడమే కాకుండా.. లంచం డిమాండ్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాం ప్రసాద్.. ఆడియో టేపుల వల్ల.. తను మొదటిసారిగా ఇలా కార్యాలయానికి రావడం బాధగా ఉందన్నారు ఎమ్మెల్యే రజినీ. ఇలాంటి వాళ్లకు అసలు ఈ రాష్ట్రంలోనే ఉండే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఎంతో నిజాయితీగా మద్యం అమ్మకాలను దశలవారీగా తగ్గించుకుంటూ వస్తోందని.. కానీ కొంతమంది అధికారుల వల్ల తమ సీఎం జగన్ ఆశయం దెబ్బతింటోందని ఆమె ఫైర్ అయ్యారు. అలాంటి వారిని వదిలిపెట్టేది లేదని.. సదరు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి తక్షణమే హెడ్ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విడదల రజిని కోరారు.

ఇవి కూడా చదవండి:

రెహమాన్‌కు బ్రేక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మృతి

‘పాలు’ తాగాడని కన్న కొడుకును చంపి, ఆత్మహత్య చేసుకున్న తండ్రి

కరోనా ‘మెడికల్ జ్యువెలరీ’.. వైరస్‌తో వ్యాపారమంటూ..

మరో వారంలో 15 అంతస్తుల కరోనా ఆస్పత్రి సిద్ధం..

చేతల్లోకి దిగండంటూ.. సీఎంపై గౌతమ్ గంభీర్ ఫైర్