కరోనా కొత్త రికార్డులు.. టాప్ సెవెన్‌లోకి భారత్

|

Jun 01, 2020 | 9:31 AM

దేశంలో ప్రతిరోజూ కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగిపోతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రోజు వందల సంఖ్యలో మరణాలు, వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు భారత్‌ను వణికిస్తోంది.  తాజాగా ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 8,392 మంది కరోనా బారినపడినట్టు తేలడంతో బాధితుల సంఖ్య 1,90,535కు చేరుకుంది. అదేవిధంగా, ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,394 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేసుల సంఖ్య రీత్యా […]

కరోనా కొత్త రికార్డులు.. టాప్ సెవెన్‌లోకి భారత్
Follow us on

దేశంలో ప్రతిరోజూ కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగిపోతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రోజు వందల సంఖ్యలో మరణాలు, వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు భారత్‌ను వణికిస్తోంది.  తాజాగా ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 8,392 మంది కరోనా బారినపడినట్టు తేలడంతో బాధితుల సంఖ్య 1,90,535కు చేరుకుంది. అదేవిధంగా, ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,394 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేసుల సంఖ్య రీత్యా ప్రపంచంలోనే టాప్‌ సెవెన్‌లోకి భారత్ చేరిపోయింది. దేశంలో కోవిడ్‌–19 యాక్టివ్‌ కేసులు 93,322 కాగా మొత్తం 91,818 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,90,535
దేశంలో ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 93,322
దేశవ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 5,394
క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన‌వారు 91,818

దీంతో రికవరీ రేటు 47.76 శాతంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. లాక్ డౌన్‌ ఆంక్షలకు స్వస్తి పలికే దిశగా రాష్ట్రాలు కేంద్రం కదులుతున్న విషయం తెలిసిందే. జూన్ 30 వరకూ లాక్ డౌన్ ఉంటుందని ప్రకటించినప్పటికీ ఆంక్షల స్ఫూర్తిని కొనసాగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వమే స్పష్టం చేసింది.