కరోనాని క్షణాల్లో గుర్తించొచ్చు..! బ్రీతింగ్ అనలైజరే ఆదర్శమట..!
ప్రపంచ దేశాల్ని వణికిస్తోన్న కరోనా వైరస్ గురించి తెలిసిందే. ఈ వైరస్ బారిన పడితే.. బతకడమన్నది కష్టమే. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి.. ఇప్పటికే మూడు వేల మందికి పైగా ప్రాణాలను తీసింది. అయితే ఈ భయంకరమైన వైరస్ను గుర్తించడం..

ప్రపంచ దేశాల్ని వణికిస్తోన్న కరోనా వైరస్ గురించి తెలిసిందే. ఈ వైరస్ బారిన పడితే.. బతకడమన్నది కష్టమే. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి.. ఇప్పటికే మూడు వేల మందికి పైగా ప్రాణాలను తీసింది. అయితే ఈ భయంకరమైన వైరస్ను గుర్తించడం.. తొలుత శాస్త్రవేత్తలకు ఓ పెద్ద టాస్క్గా మారింది. ఆ తర్వాత వైరస్ లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది గుర్తించడానికి కనీసం 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతోంది. అయితే ఈ వైరస్ను త్వరితగతిన గుర్తించేందుకు లండన్ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు.
ఇక ఈ కరోనా వైరస్ (కొవిడ్-19)ను క్షణాల్లోనే గుర్తించవచ్చంటున్నారు. న్యూకాజల్లోని నార్తుంబ్రియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల బృందం.. బ్రీతింగ్ ద్వారా ఈ కరోనా వైరస్ను గుర్తించవచ్చంటున్నారు. దీనికి సంబంధించి ఓ బయో మీటర్ను కనుగొన్నారు. ప్రస్తుతం రోగుల లాలాజలాన్ని ల్యాబ్కు పంపించి పరీక్షించడం ద్వారా.. కరోనా లక్షణాలను గుర్తిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ ద్వారా కనుగునేందుకు దాదాపు రెండు రోజుల సమయం పడుతోంది. ఇప్పుడు వచ్చే కొత్త ప్రాసెస్ ద్వారా.. కరోనా వైరస్స్ సోకిందీ లేనిదీ.. కొన్ని క్షణాల్లోనే కనుగొనవచ్చు.
ఈ బయో మీటర్ను తయారు చేసేందుకు.. బ్రీత్ అనలైజర్ పని చేసేవిధానాన్ని ప్రామాణికంగా తీసుకుని తయారు చేశారు. మద్యం మత్తులో వాహనాదారులను గుర్తించేందుకు పోలీసులు ఉపయోగిస్తున్న “బ్రీతింగ్ అనలైజర్” లాగే.. ఈ బయోమీటర్ కూడా పనిచేస్తుందని, అయితే ఇందులో డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రొటీన్లు, ఫ్యాట్ మాలెక్యూల్స్ ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. అయితే ఈ కరోనా వైరస్ను మాత్రమే కాకుండా.. ఇతర ఊపిరితిత్తుల జబ్బులను, క్యాన్సర్, మధు మేహం లాంటి జబ్బులను కూడా దీని ద్వారా గుర్తించేందుకు వీలుంటుందని చెబుతున్నారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద ప్రయాణికులను ఈ బయో మీటర్ల ద్వారా చెక్ చేయడం సులభంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వెంటనే వీటి ఉత్పత్తులను చేపట్టి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తామంటున్నారు.