మాస్కుల పునర్వినియోగానికి ‘ఎఫ్‌డీఏ’ ఆమోదం

| Edited By:

Apr 14, 2020 | 3:27 PM

భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా విరుచుకుపడుతున్న కరోనా కట్టడిలో మాస్క్ ఎంతో కీలకమన్న విషయం తెలిసిందే. ఈ తొడుగులతో వైరస్ మన దరి చేరకుండా కాపాడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక సూచనలు చేసింది అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్...

మాస్కుల పునర్వినియోగానికి ఎఫ్‌డీఏ ఆమోదం
Follow us on

భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా విరుచుకుపడుతున్న కరోనా కట్టడిలో మాస్క్ ఎంతో కీలకమన్న విషయం తెలిసిందే. ఈ తొడుగులతో వైరస్ మన దరి చేరకుండా కాపాడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక సూచనలు చేసింది అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ప్రజా అవసరాల దృష్ట్యా మాస్కుల కొరత ఏర్పడిన నేపథ్యంలో.. ఎన్‌95 మాస్కుల వినియోగంపై తన అత్యవసర ఆదేశాన్ని జారీ చేసింది. రోజూ దాదాపు 4 మిలియన్ల తొడుగులను స్టెరిలైజ్ అంటే శుభ్రం చేయాలని సూచించింది. అనంతరం ఆరోగ్య సేవల సిబ్బంది వీటిని తిరిగి వాడుకోవచ్చని స్పష్టం చేసింది. ఒక మాస్క్ ఎన్ని రోజులు ధరించాలో డబ్ల్యూహెచ్‌వో చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే మాస్కులు వాడిపారేయడం వల్ల కొరతకు దారితీస్తోంది. కాగా భారత్‌లోని ఎయిమ్స్ కూడా మాస్కుల వినియోగంపై ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక్కో మాస్కును నాలుగు సార్లు వాడాలని వైద్యులను కోరింది.

ఇవి కూడా చదవండి:

విజయవాడలోని టిఫిన్ సెంటర్ వ్యాపారికి కరోనా..

లాక్‌డౌన్ టైం.. మద్యం సేవిస్తూ పట్టుబడ్డ అధికారులు

స్వైన్‌ ఫ్లూ కంటే కరోనా పది రెట్లు ప్రమాదకరం

21 రోజుల లాక్‌డౌన్ దెబ్బకి.. రూ.8 లక్షల కోట్ల నష్టం