భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా విరుచుకుపడుతున్న కరోనా కట్టడిలో మాస్క్ ఎంతో కీలకమన్న విషయం తెలిసిందే. ఈ తొడుగులతో వైరస్ మన దరి చేరకుండా కాపాడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక సూచనలు చేసింది అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ప్రజా అవసరాల దృష్ట్యా మాస్కుల కొరత ఏర్పడిన నేపథ్యంలో.. ఎన్95 మాస్కుల వినియోగంపై తన అత్యవసర ఆదేశాన్ని జారీ చేసింది. రోజూ దాదాపు 4 మిలియన్ల తొడుగులను స్టెరిలైజ్ అంటే శుభ్రం చేయాలని సూచించింది. అనంతరం ఆరోగ్య సేవల సిబ్బంది వీటిని తిరిగి వాడుకోవచ్చని స్పష్టం చేసింది. ఒక మాస్క్ ఎన్ని రోజులు ధరించాలో డబ్ల్యూహెచ్వో చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే మాస్కులు వాడిపారేయడం వల్ల కొరతకు దారితీస్తోంది. కాగా భారత్లోని ఎయిమ్స్ కూడా మాస్కుల వినియోగంపై ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక్కో మాస్కును నాలుగు సార్లు వాడాలని వైద్యులను కోరింది.
ఇవి కూడా చదవండి:
విజయవాడలోని టిఫిన్ సెంటర్ వ్యాపారికి కరోనా..
లాక్డౌన్ టైం.. మద్యం సేవిస్తూ పట్టుబడ్డ అధికారులు
స్వైన్ ఫ్లూ కంటే కరోనా పది రెట్లు ప్రమాదకరం