విజయవాడలోని టిఫిన్ సెంటర్ వ్యాపారికి కరోనా..
ఏపీలో ప్రస్తుతం వరుసగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా విజయవాడలోని ఓ టిఫిన్ బండి వ్యాపారికి కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టిస్తోంది. రాణిగారితోట ప్రాంతానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా..
ఏపీలో ప్రస్తుతం వరుసగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా విజయవాడలోని ఓ టిఫిన్ బండి వ్యాపారికి కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టిస్తోంది. రాణిగారితోట ప్రాంతానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా వైద్యులు చెబుతున్నారు. కాగా ఈ వైరస్ సోకకు ముందు వరకూ టిఫిన్ అమ్మకాలు చేశాడు ఈ వ్యాపారి. అయితే టిఫిన్ సెంటర్ యజమానికి పానీపూరి వ్యాపారి నుంచి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. రాణిగారితోటకు చెందిన ఈ ఇద్దరు వ్యాపారులకు కరోనా రావటంతో స్థానికులు తీవ్ర ఆందోళ చెందుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని రెడ్జోన్గా ప్రకటించిన అధికారులు.. లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
లాక్డౌన్ టైం.. మద్యం సేవిస్తూ పట్టుబడ్డ అధికారులు
స్వైన్ ఫ్లూ కంటే కరోనా పది రెట్లు ప్రమాదకరం