ఇంత దారుణమా.. కరోనా సోకిందని భర్తను మధ్యలోనే వదిలేసి..

| Edited By:

Jul 10, 2020 | 7:51 PM

కరోనా మహమ్మారి మనుషుల మధ్య దూరాన్ని అమాంతం పెంచేసింది. అంతేకాదు.. మనుషుల్లో ఉన్న నిజ స్వరూపాన్ని బయటపెట్టిస్తోంది. ఈ మహమ్మారి సోకితే.. కనీసం కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి రాని పరిస్థితి నెలకొంది. దీంతో..

ఇంత దారుణమా.. కరోనా సోకిందని భర్తను మధ్యలోనే వదిలేసి..
Follow us on

కరోనా మహమ్మారి మనుషుల మధ్య దూరాన్ని అమాంతం పెంచేసింది. అంతేకాదు.. మనుషుల్లో ఉన్న నిజ స్వరూపాన్ని బయటపెట్టిస్తోంది. ఈ మహమ్మారి సోకితే.. కనీసం కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి రాని పరిస్థితి నెలకొంది. దీంతో కరోనా సోకిన వ్యక్తుల పరిస్థితి ఘోరంగా మారుతోంది. అంతేకాదు.. ఈ వైరస్ ఆనవాళ్లు ఉన్నా.. వైరస్ సోకినా వారిని ప్రయాణాల్లో
కూడా అనుమతివ్వడం లేదు. అనుమానం కల్గితే మధ్యలోనే వదిలేస్తున్నారు.

తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని కరపలో ఓ సంఘటన చోటుచేసుకుంది. డయాలసిస్ చేయించుకుని ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సులో తన ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకిందనే సమాచారం తెలియడంతో.. ఆయన్ను మధ్యలోనే దింపేశారు బస్సు డ్రైవర్‌. అయితే ఆయన రామచంద్రపురానికి వెళ్లేందుకు కాకినాడలో ఆర్టీసీ బస్సు ఎక్కారు. అయితే ఆయనకు కరోనా పరీక్షలు చేసిన తర్వాత.. రిపోర్టులు వచ్చే వరకు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు. అయితే వారు మాత్రం ఉండకుండా.. అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఆర్టీసీ బస్సు ఎక్కేశారు. అయితే ఈ విషయాన్ని ఆర్టీసీ సిబ్బందికి తెలియ జేయడం.. ఆ వెంటనే రిపోర్ట్ కూడా పాజిటివ్ రావడంతో అధికారుల వెంటనే బస్సు డ్రైవర్‌కు సమాచారం అందించారు. దీంతో బస్సు డ్రైవర్‌ ఆ భార్యభర్తలను కరప మార్కెట్‌ సెంటర్‌ వద్ద దింపేశారు. అయితే అతడితో పాటు దిగిన తన భార్య కాసేపటికే అదృశ్యం అయ్యింది. దీంతో బాధితుడు ఒక్కడే నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. బాధితుడిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.