కరోనా ఇంపాక్ట్: రిజర్వ్ బ్యాంకులో వెయ్యి కోట్లు అప్పుతీసుకున్న ఏపీ ప్రభుత్వం

| Edited By:

Apr 09, 2020 | 3:25 PM

కరోనా ఎఫెక్ట్‌కు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. గత ఏడాదిలో రూ.77 వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉంది. ఆర్థిక సంవత్సరం మొదట్లోనే కరోనా రూంలో ఏపీకి భారీగా..

కరోనా ఇంపాక్ట్: రిజర్వ్ బ్యాంకులో వెయ్యి కోట్లు అప్పుతీసుకున్న ఏపీ ప్రభుత్వం
Follow us on

కరోనా ఎఫెక్ట్‌కు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. గత ఏడాదిలో రూ.77 వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉంది. ఆర్థిక సంవత్సరం మొదట్లోనే కరోనా రూంలో ఏపీకి భారీగా దెబ్బ పడింది. దీంతో రాబడి రాకుండా పోయింది. దానికి తోడు.. కరోనా వల్ల.. వైద్యం కోసం, ప్రజల కోసం అధికంగా ఖర్చు అవుతోంది. పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు విరాళాలు ప్రకటించినా.. అది ఎంతకూ సరిపోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక కార్యక్రమాలన్నీ పూర్తిగా స్తంభించిపోయాయి. రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ రంగాల నుంచి కూడా పూర్తిగా ఆదాయం తగ్గిపోయింది.

అందులోనూ ఈ సమయంలో జీతాలు, పెన్షన్లు, ఆసరా పింఛన్లు సహా పలు కీలక పథకాలకు దాదాపు రూ.10 వేల కోట్లు అవసరమవుతాయి. దీంతో కేంద్ర పన్నుల వాటా, రుణాలు సహా ఇతర మార్గాల ద్వారా నిధులను సమీకరించడంపై ఆర్థిక శాఖ దృష్టి సారించింది. అటు ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని జగన్ సర్కార్ మంగళవారం రూ. వెయ్యి కోట్ల రుణాన్ని సమీకరించింది. సెక్యూరిటీల వేలం కోసం ప్రయత్నించగా రిజర్వు బ్యాంకు నుంచి 11 ఏళ్ల కాలానికి 7.98 శాతం వడ్డీ కింద రూ.100 కోట్లు అప్పు చేసింది.

ఇవి కూడా చదవండి:

బస్ టికెట్ రిజర్వేషన్లు ఆపేసిన ఏపీఎస్ఆర్టీసీ..

మరో టాస్క్ ఇచ్చిన ప్రధాని.. ఈ సారి ఏం చేయాలంటే?

గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి రూ.6 లక్షల ఇన్సూరెన్స్..

తెలంగాణ ప్రభుత్వానికి.. ‘మొగలి రేకులు’ ఫేమ్ ఆర్కే నాయుడు విరాళం

ఏప్రిల్ 11న ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. సీఎంలతో మరోసారి కాన్ఫరెన్స్

హైదరాబాద్‌ రోడ్లపై చక్కర్లు కొడుతున్న ‘కరోనా కారు’

తెలంగాణలో హాట్‌ స్పాట్‌లుగా వంద ప్రదేశాలు.. మరింత కట్టుదిట్టం