తెలుగు సినీ కార్మికులకి అమితాబ్ విరాళాలు.. థ్యాంక్స్ చెప్పిన చిరు

| Edited By:

Apr 17, 2020 | 1:51 PM

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ కార్మికుల కోసం అమితాబ్ 12 వేల కూపన్స్ విరాళంగా ఇచ్చారు. ఈ ఒక్కొక్క కూపన్ విలువ 1,500 రూపాయలు. అంటే దాదాపు ఈ మొత్తం కూపన్స్ విలువ 1.8 కోట్లు. వీటిని బిగ్‌ బజార్ షాపింగ్..

తెలుగు సినీ కార్మికులకి అమితాబ్ విరాళాలు.. థ్యాంక్స్ చెప్పిన చిరు
Follow us on

మెగాస్టార్ చిరంజీవి.. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ట్విట్టర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినీ కార్మికుల కోసం బిగ్‌బీ చేసిన భారీ సాయాన్ని చిరు ట్విట్టర్‌ వేదికగా కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ కార్మికుల కోసం అమితాబ్ 12 వేల కూపన్స్ విరాళంగా ఇచ్చారు. ఈ ఒక్కొక్క కూపన్ విలువ 1,500 రూపాయలు. అంటే దాదాపు ఈ మొత్తం కూపన్స్ విలువ 1.8 కోట్లు. వీటిని బిగ్‌ బజార్ షాపింగ్ కొరకు ఉపయోగించవచ్చని తెలిపారు. చిత్ర పరిశ్రమలన్నీ ఒక కుటుంబంగా భావించి అమితాబ్ ఈ సాయం చేశారని కొనియాడారు చిరంజీవి.

కాగా కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌ లేని సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవి ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ (సీసీసీ) పేరుతో ఓ సహాయ నిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు, హీరోయిన్స్, పలువురు ప్రముఖులు ఈ ఛారిటీకి విరివిగా విరాళాలు ప్రకటించారు. ఇటీవలే తొడి విడతగా రేషన్, మందులను కొంతమందికి పంచినట్లు కమిటీ సభ్యుడు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.

రికార్డు సృష్టించిన బంగారం.. రూ. 47 వేలకు చేరువ

లాక్‌డౌన్: నడి రోడ్డుపైనే ప్రసవించిన మహిళ

హైదరాబాద్‌లో కరోనా పేషెంట్ అరెస్ట్.. దేశంలోనే ఫస్ట్ టైమ్

లాక్‌‌డౌన్‌ ఎఫెక్ట్: భారీగా తగ్గిన చమురు విక్రయాలు