కరోనా విరుగుడు డ్రగ్ తయారు చేస్తున్నాం.. చైనా

| Edited By: Pardhasaradhi Peri

May 19, 2020 | 11:08 AM

కరోనా విరుగుడు మందును తాము కనుగొంటున్నామని, కరోనాకు చెక్ చెప్పగల ‘పవర్’ దానికి ఉందని చైనాలోని ఓ ల్యాబ్ ప్రకటించింది. ఆ దేశంలోని పెకింగ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్లు… తమ ల్యాబ్ లో ఈ మందును డెవలప్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఇది కరోనా వైరస్ సోకినవారి రికవరీ సమయాన్ని తగ్గిస్తుందని, (అంటే త్వరలో కోలుకోగలుగుతారని), పైగా వైరస్ ని ఎదుర్కోగల నిరోధక శక్తి కూడా వారిలో కలుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న బీజింగ్ […]

కరోనా విరుగుడు డ్రగ్ తయారు చేస్తున్నాం.. చైనా
Follow us on

కరోనా విరుగుడు మందును తాము కనుగొంటున్నామని, కరోనాకు చెక్ చెప్పగల ‘పవర్’ దానికి ఉందని చైనాలోని ఓ ల్యాబ్ ప్రకటించింది. ఆ దేశంలోని పెకింగ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్లు… తమ ల్యాబ్ లో ఈ మందును డెవలప్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఇది కరోనా వైరస్ సోకినవారి రికవరీ సమయాన్ని తగ్గిస్తుందని, (అంటే త్వరలో కోలుకోగలుగుతారని), పైగా వైరస్ ని ఎదుర్కోగల నిరోధక శక్తి కూడా వారిలో కలుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న బీజింగ్ అడ్వాన్స్డ్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ జీనోమిక్స్ డైరెక్టర్ సన్నే జీ దీన్ని వివరిస్తూ… ఈ డ్రగ్ ను ఎలుకలపై ప్రయోగించి చూసినప్పుడు సక్సెస్ అయిందన్నారు. న్యుట్రలైజ్ చేసిన యాంటీ బాడీలను ఎలుకలకు ఇంజెక్ట్ చేసినప్పుడు 5 రోజుల అనంతరం వాటిలో రోగ నిరోధక శక్తి పెరిగిందన్నారు. కరోనా నుంచి కోలుకున్న 60 మంది రోగుల రక్తం నుంచి తమ టీమ్ వైరస్ ఇన్ఫెక్ట్ అయిన కణాలను ఐసొలేట్ చేసినట్టు ఆయన చెప్పారు. యాంటీ బాడీల ‘అన్వేషణ’లో తాము పగలు, రాత్రి పని చేస్తున్నామన్నారు. ఈ  సంవత్సరాంతానికి ఈ డ్రగ్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నామని, మొదట దీన్ని ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో పరీక్షిస్తామని సన్నే జీ వెల్లడించారు.