ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 84,858 పరీక్షలు నిర్వహించగా.. 2,252 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 19,54,765 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. కొవిడ్ వల్ల మరో 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,256 కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,440 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,19,354కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,155 యాక్టివ్ కేసులున్నాయి.
జిల్లాలవారీగా కేసుల వివరాలను దిగువన చూడండి…
#COVIDUpdates: 25/07/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,51,870 పాజిటివ్ కేసు లకు గాను
*19,16,459 మంది డిశ్చార్జ్ కాగా
*13,256 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 22,155#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/gVQAV0uhqu— ArogyaAndhra (@ArogyaAndhra) July 25, 2021
కరోన సమాచారం ఇక నుండి మీ చేతుల్లోనే:
● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి.
● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు
● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు
● https://esanjeevani.com/ వెబ్ సైట్ ద్వా రా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు.
● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. క్రింద లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.
https://play.google.com/store/apps/details?id=com.entrolabs.apcovid19
Also Read: నెట్టింట వైరల్గా మారిన నెల్లూరు జిల్లా మినిస్టర్ల వర్కవుట్స్