AP Corona Cases: ఏపీలో పెరిగిన కరోనా వ్యాప్తి.. కొత్తగా 1,520 కేసులు.. జిల్లాల వారీగా కేసుల వివరాలు

|

Sep 03, 2021 | 5:30 PM

ఏపీలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. కృష్ణా జిల్లాలో మృతుల సంఖ్య ప్రమాదకరంగా ఉంది.

AP Corona Cases: ఏపీలో పెరిగిన కరోనా వ్యాప్తి.. కొత్తగా 1,520 కేసులు.. జిల్లాల వారీగా కేసుల వివరాలు
Ap Corona
Follow us on

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 64,739 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1,520 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2018200కి చేరింది. కొత్తగా 10 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13887 కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో1,290మంది వైరస్ కారణంగా కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19891391కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14922 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 2,68,09,774 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ వల్ల కొత్తగా కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూర్ జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఒక్కరు మరణించారు. కాగా తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 263 కేసులు వెలుగుచూశాయి. చిత్తూరు జిల్లాలో ప్రమాదకరంగా 188 కొత్త కేసులు వెలుగుచూశాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలను దిగువన పట్టికలో చూడండి…

కరోనా సమాచారం మీ చేతుల్లోనే:

● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి.
● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు
● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు
వెబ్ సైట్ ద్వా రా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు.
● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app.  ఈ లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.

Also Read: చిత్తూరు జిల్లాలో సంచలనం… 74 మంది వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా

విశాఖ వీధుల్లో పందుల పందేలు.. ఊలలు, అరుపులు.. స్థానికులు బెంబేలు