Andhra Corona Case: క‌రోనా కార‌ణంగా ఏపీలో కొత్త‌గా 106 మరణాలు… పాజిటివ్, యాక్టివ్ కేసుల వివ‌రాలు ఇలా ఉన్నాయి

|

May 25, 2021 | 6:35 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా తీవ్ర‌త‌ కొనసాగుతోంది. కొత్తగా న‌మోద‌య్యే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం క‌ల‌వ‌ర‌పెడుతుంది.

Andhra Corona Case: క‌రోనా కార‌ణంగా ఏపీలో కొత్త‌గా  106 మరణాలు... పాజిటివ్, యాక్టివ్ కేసుల వివ‌రాలు ఇలా ఉన్నాయి
Ap Corona
Follow us on

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా తీవ్ర‌త‌ కొనసాగుతోంది. కొత్తగా న‌మోద‌య్యే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం క‌ల‌వ‌ర‌పెడుతుంది. కొత్త‌గా రాష్ట్రంలో 72,979 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 15,284 మందికి వైర‌స్ సోకిన‌ట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,09,105కి చేరింది. తాజాగా మరో 106 మంది కరోనా కార‌ణంగా మ‌ర‌ణించ‌గా.. మొత్తం మృతుల సంఖ్య 10,328కి పెరిగింది. తాజాగా 20,917 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,98,023 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్రప్రభుత్వం బులిటెన్‌లో తెల‌పింది. ఇప్పటి వరకు 1,87,49,201 శాంపిల్స్ టెస్ట్ చేసిన‌ట్లు వెల్ల‌డించింది. కరోనా కార‌ణంగా కొత్త‌గా చిత్తూరులో అత్యధికంగా 15 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది, పశ్చిమగోదావరిలో 10 మంది, అనంతపురం, తూర్పుగోదావరి,నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 9 మంది, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఐదుగురు, కడపలో ఒకరు చొప్పున మ‌రణించారు.

 

ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై తెలిపిన వివ‌రాలు

  1. గత 24 గంటల్లో 72979 టెస్టులు చేశాం.. 15,284 మందికి పాజిటివ్ వచ్చింది… 106 మంది మృతి.
  2. ఐసీయూ బెడ్లు 624 అందుబాటులో ఉన్నాయి.
  3. విజయనగరం మినహా అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి.
  4. రెమిడిసివిర్ ఇంజెక్షన్లకు ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి డిమాండ్ చాలా తగ్గింది.
  5. గత మూడు రోజుల నుంచి ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువగా రెమిడీసివిర్ ఇంజెక్షన్ల కోసం అడగడం లేదు.
  6. తుపాను వల్ల ఆక్సిజన్ సరఫరాకు ఇబ్బంది రాకుండా చర్యలు…767 టన్నుల మేర ఆక్సిజన్ డ్రా చేసుకున్నాం..ఆక్సిజన్ సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు స్టోర్ చేసుకుంటున్నాం.
  7. 252 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నట్టు గుర్తించాం….2100 బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల డోసులు వచ్చాయి…మొత్తంగా ఇప్పటి వరకు 3 వేల బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు వచ్చాయి.
  8. ఆనందయ్య మందుపై మరో మూడు, నాలుగు రోజుల్లో పూర్తి స్థాయి నినేదికలు రావచ్చు.. మందుపై త్వరలోనే స్పష్టత రానుంది.
  9. కంటి డాక్టర్లు తో మందు పై అధ్యయనం చేయమని చెప్పాము.

Also Read:మండుటెండ‌లో న‌డిరోడ్డుపై దాహంతో ఉన్న గ‌ద్ద‌కు నీళ్లు అందించిన బాట‌సారులు.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు

తినేట‌ప్పుడు కూడా ఫోన్‌లో ముఖం పెట్టిన వ్య‌క్తి.. అత‌డి భార్య ఎలా తిక్క కుదిర్చిందో చూడండి