డ్రోన్ “ఆకాశవాణి” హెచ్చరికలు.. ఎలా ఉంటున్నాయంటే..

| Edited By:

Apr 29, 2020 | 4:30 PM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో.. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిని.. పోలీసులు వినూత్న రీతిలో కంట్రోల్ చేస్తున్నారు. నిబంధనలను పాటించకుండా ఉండే వారిని పట్టుకునేందుకు ఇక డ్రోన్‌ల సహాయాన్ని తీసుకుంటున్నారు. వీటి ద్వారా ఎవరెవరు ఉల్లంఘిస్తున్నారో పసిగట్టి.. వారిని అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా.. డ్రోన్‌లకు రేడియోతో పాటు.. పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్ సెట్‌చేసి.. అదే డ్రోన్‌ ద్వారా నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారికి హెచ్చరికలు జారీచేస్తోంది. ఐదు కిలోమీటర్ల దూరంలోని కాలనీల్లో పోలీసుల […]

డ్రోన్ ఆకాశవాణి హెచ్చరికలు.. ఎలా ఉంటున్నాయంటే..
Follow us on

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో.. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిని.. పోలీసులు వినూత్న రీతిలో కంట్రోల్ చేస్తున్నారు. నిబంధనలను పాటించకుండా ఉండే వారిని పట్టుకునేందుకు ఇక డ్రోన్‌ల సహాయాన్ని తీసుకుంటున్నారు. వీటి ద్వారా ఎవరెవరు ఉల్లంఘిస్తున్నారో పసిగట్టి.. వారిని అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా.. డ్రోన్‌లకు రేడియోతో పాటు.. పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్ సెట్‌చేసి.. అదే డ్రోన్‌ ద్వారా నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారికి హెచ్చరికలు జారీచేస్తోంది. ఐదు కిలోమీటర్ల దూరంలోని కాలనీల్లో పోలీసుల స్థానంలో ఈ ఆకాశవాణి డ్రోన్‌లతో నిఘా పెడుతున్నారు అధికారులు.

ఈ డ్రోన్‌ ఆకాశంలో విహరిస్తూ.. ప్రజలు సోషల్ డిస్టెన్స్‌ పాటించాలంటూ ఆదేశాలను జారీ చేస్తోంది. కరోనా యాక్షన్ టీం మెంబర్‌ బైక్‌పై వెళ్తూ.. ఈ డ్రోన్‌ను కంట్రోల్‌ చేస్తుంటారు. ఢిల్లీలోని మెహరౌలీ ప్రాంతంలో.. దుకాణాల వద్ద ప్రజలు సోషల్ డిస్టెన్స్‌ పాటించకుండా ఉంటే.. వెంటనే డ్రోన్‌ ఆకాశవాణిలా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలంతా అలర్ట్‌ అయ్యారు. ఇలా ఢిల్లీ పోలీసులు డ్రోన్‌లను ఉపయోగిస్తూ.. లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రజలంతా పాటించేలా చేస్తున్నారు.