కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 948 కొత్త కేసులు.. ఐదుగురు మృతి.. కోలుకున్న 1,607 మంది

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 948  కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,59,776 కు చేరింది.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 948 కొత్త కేసులు.. ఐదుగురు మృతి.. కోలుకున్న 1,607 మంది
Follow us

| Edited By:

Updated on: Nov 18, 2020 | 12:48 PM

Telangana Corona Updates: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 948  కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,59,776 కు చేరింది. 24 గంటల్లో ఐదుగురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,415కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,607 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,45,293కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 13,068యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 43,433 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 49,72,407కు చేరింది. (వ్యాక్సిన్‌ తీసుకోవడం, తీసుకోకపోవడం వారి ఇష్టం.. ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు )

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 154, ఆదిలాబాద్ 14, భద్రాద్రి కొత్తగూడెం 61, జగిత్యాల్‌ 27, జనగాం 9, జయశంకర్ భూపాలపల్లి 14, జోగులమ్మ గద్వాల్‌ 8, కామారెడ్డి 25, కరీంనగర్‌ 55, ఖమ్మం 44, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 5, మహబూబ్‌ నగర్‌ 11, మహబూబాబాద్‌ 11, మంచిర్యాల్‌ 26, మెదక్‌ 15, మేడ్చల్ మల్కాజ్‌గిరి 83, ములుగు 18, నాగర్‌ కర్నూల్‌ 16, నల్గొండ 45, నారాయణ్‌పేట్‌ 4, నిర్మల్‌ 10, నిజామాబాద్‌ 13, పెద్దంపల్లి 22, రాజన్న సిరిసిల్ల 9, రంగారెడ్డి 76, సంగారెడ్డి 38, సిద్ధిపేట్‌ 22, సూర్యాపేట 24, వికారాబాద్‌ 14, వనపర్తి 11, వరంగల్‌ రూరల్‌ 12, వరంగల్‌ అర్బన్‌ 40, యాద్రాది భువనగిరి 12 కేసులు నమోదయ్యాయి. (చంద్రప్రభ వాహనంపై.. ధనలక్ష్మిగా దర్శనమిచ్చిన పద్మావతి అమ్మవారు)