బ్రేకింగ్: గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీకి అనుమతి లభించింది. వ్యాధి నుంచి కోలుకున్న వారి నుంచి గాంధీ వైద్యులు ప్లాస్మా..

హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా వైరస్ చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీకి అనుమతి లభించింది. దీంతో వ్యాధి నుంచి కోలుకున్న వారి నుంచి గాంధీ వైద్యులు ప్లాస్మా సేకరించనున్నారు. కరోనా సోకి అత్యవసర స్థితిలో ఉన్నవారికి ఈ ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతుంది. దాదాపు ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్రంలో 332 మంది కరోనా పేషెంట్లు వ్యాధి నుంచి కోలుకున్నారు.
అలాగే.. అటు 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్, మంత్రి కేటీఆర్కు లేఖలు రాశారు. వారి పేర్లను కూడా జత చేస్తూ ఇప్పటికే లేఖను కూడా పంపించారు ఎంపీ అసదుద్దీన్.
కాగా తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. సోమవారం కొత్తగా కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ రెండు కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1003కు చేరింది. ఇప్పటివరకూ కరోనా కారణంగా 25 మంది మరణించారు. కాగా కరోనా సోకి కోలుకుని ఆసుపత్రి నుంచి 332 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Read More:
మూడో విడత రేషన్ పంపిణీ.. ఈసారి బయోమెట్రిక్ తప్పనిసరి తాజా రూల్స్ ఇవే!
లైవ్లో ‘ఐలవ్యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ