TS PGECET 2021: తెలంగాణ పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు.. ఎప్పటివరకంటే..?

Telangana PGECET 2021: తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ (పీజీఈసెట్) 2021 రిజిస్ట్రేషన్ తేదీ గడువును పెంచుతూ ఉన్నత విద్యామండలి

TS PGECET 2021: తెలంగాణ పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు.. ఎప్పటివరకంటే..?
TS PGECET-2021

Updated on: May 01, 2021 | 2:17 PM

Telangana PGECET 2021: తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ (పీజీఈసెట్) 2021 రిజిస్ట్రేషన్ తేదీ గడువును పెంచుతూ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా గడువు తేదీని పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 30తో గడువు పూర్తయింది. తాజాగా ఈ గడువును మే 7 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మార్చి నెలలో తెలంగాణ పీజీఈసెట్ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.

కంప్యూటర్ ఆధారంగా నిర్వహించే ఈ పరీక్షలను జూన్ 19 నుంచి 22 వరకు రెండు సెషన్స్ లల్లో నిర్వహించనున్నారు. అప్లికేషన్ ధర జనరల్ అభ్యర్థులకు రూ.1000 కాగా.. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.500గా నిర్ణయించారు. హాల్ టికెట్లను జూన్ 10 నుంచి 18 వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. పూర్తి వివరాలను https://www.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు.

2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ, గ్రాడ్యుయేట్-స్థాయి ఫార్మ్-డి, పోస్ట్ గ్రాడ్యుయేట్ (పిజి) కోర్సులలో ప్రవేశం కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం టీఎస్ పీజీఈసెట్ 2021 పరీక్షను నిర్వహిస్తుంది. ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఈ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం రెండు గంటలపాటు ఉంటుంది.

Also Read:

కోవిడ్ రోగుల కోసం, ‘హలో డాక్టర్’ మెడికల్ హెల్ప్ లైన్ లాంచ్ చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

Corona Food: క‌రోనా నుంచి కోలుకున్నాక నీర‌సంగా ఫీల‌వుతున్నారా.? అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే..

Loading...
Unable to load recommendations.
Follow Us