
హైదరాబాద్, మే 14: తెలంగాన రాష్ట్రంలో మే 22వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 4,12,724 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. వారిలో ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 2,49,032 మంది, ఒకేషనల్ విద్యార్థులు 16,994 మంది ఉన్నారు. నిజానికి, ఏప్రిల్ 22న విడుదలైన ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో తొలి ఏడాదిలో తప్పిన విద్యార్థుల సంఖ్య 1.91 లక్షల మంది మాత్రమే. అయితే మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్మెంట్ రాసేవారు ఏకంగా 50 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోవడంతో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష రాసే విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక సెకండియర్ జనరల్ పరీక్షలకు 1,34,341 మంది, ఒకేషనల్కు 12,357 మంది పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించారు.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపులు మే 13వ తేదీతో ముగిసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు అధికారులు దరఖాస్తు గడువు పొడించడంతో మంగళవారం సాయత్రం వరకు రూ. 2,500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. ఇక ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 22 నుంచి 29 వరకు జరగనున్న సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.