
టీజీ ఈఏపీసెట్ 2026 అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం ప్రశ్న లు, సమాధానాలపై ఒక్క అభ్యంతరం కూడా రాకపోవడం గమనార్హం. విద్యార్ధులు తొలిసారి ఈ స్ట్రీమ్ లో ఆన్సర్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.
పరీక్షలకు హాజరైన ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్సైట్లో నమోదు చేసి ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్కులు, నార్మలైజ్డ్ స్కోర్లు, ర్యాంక్లు కూడా నేడు అందుబాటులో ఉంచుతారు.
ఈఏపీసెట్ప్రవేశ పరీక్షలు మే 11వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే కేవలం 6 రోజుల వ్యవధిలోనే ఉన్నత విద్యామండలి వేగంగా ఫలితాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేసింది.
తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 ఫలితాల విడుదల కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు కంచెర్ల కేశవరావ్, ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగిత రాణా, TGCHE చైర్మన్ వి. బాలకిష్టా రెడ్డితోపాటు తదితరులు పాల్గొంటారు. టీజీ ఈఏపీసెట్ ర్యాంక్ కార్డులు ఉదయం 11.15 గంటల నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.
జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు జరగగా, మే 9 నుండి 11 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు రాసిన 2 లక్షలకు పైగా విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ రోజు ఉదయం 11 గంటలకు జేఎన్టీయూ హైదరాబాద్ లోని గోల్డెన్ జూబ్లీ హాల్లో జరిగే కార్యక్రమంలో ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు చేతుల మీదగా ఫలితాలు విడుదల చేయనున్నారు.
హైదరాబాద్, మే 17: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (టీజీ ఈఏపీసెట్) 2026 ఫలితాలు ఆదివారం (మే 17) విడుదల కానున్నాయి. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా చేతుల మీదగా ఫలితాలు విడుదల చేయనున్నారు. జేఎన్టీయూ హైదారబాద్ ప్రాంగణంలో ఆదివారం ఉదయం 11 ఫలితాలు వెల్లడిస్తారు. ఈ పరీక్షల్లో భాగంగా మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు జరగగా, మే 9 నుండి 11 వరకు ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది మొత్తం మొత్తం 2,10,766 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,97,241 మంది విద్యార్థులు ఇంజనీరింగ్, 84,954 మంది అగ్రికల్చర్ విద్యార్ధులు పరీక్షలు రాశారు. హైదరాబాద్లోని జేఎన్టీయూ గోల్డెన్ జూబ్లీ హాల్లో జరిగే కార్యక్రమంలో ఈ మేరకు ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేశారు.