Telangana: మార్చి 31న యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్స్ ప్రారంభం.. సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్స్‌ ప్రారంభమవుతున్నాయి. తొలుత రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నారు. మార్చి 31న ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు. ఈ మేరకు శనివారం రేవంత్ రెడ్డి పాఠశాల బ్రోచర్, వెబ్‌సైట్‌ను విడుదల చేశారు. దేశానికి రోల్‌ మోడల్‌గా వీటిని తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు..

Telangana: మార్చి 31న యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్స్ ప్రారంభం.. సీఎం రేవంత్‌ రెడ్డి
Young India Police Schools

Updated on: Mar 02, 2025 | 8:44 AM

హైదరాబాద్‌, మార్చి 2: సైనిక్‌ స్కూళ్ల తరహాలో యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌లను కూడా ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ సర్కార్‌ బాటలు వేస్తుంది. తొలుత రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నారు. మార్చి 31న ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు. ఈ మేరకు శనివారం రేవంత్ రెడ్డి పాఠశాల బ్రోచర్, వెబ్‌సైట్‌ను విడుదల చేశారు. అనంతరం యూనిఫాం నమూనాలను పరిశీలించారు. దేశానికి రోల్‌ మోడల్‌గా వీటిని తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంబించాలని, క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. భద్రతా సిబ్బంది కుటుంబ ఆందోళనలను తొలగించడానికి ఈ ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌ అన్నారు.

రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో పోలీస్, యూనిఫామ్‌ సర్వీస్‌ ఉద్యోగుల పిల్లల కోసం నెలకొల్పుతున్న యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభించనున్నారు. స్కూల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని, ఇందులో 50 శాతం సీట్లు యూనిఫాం (సెక్యూరిటీ) సిబ్బందికి రిజర్వ్ చేయబడ్డాయని తెలిపారు. పోలీస్‌ అమరుల కుటుంబాల పిల్లలకు అడ్మిషన్లలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇక మిగిలిన 50 శాతం సీట్లు ప్రజలకు అందుబాటులోకి ఉంటాయని అన్నారు. సైనిక్ స్కూల్స్ తరహాలో పోలీస్ స్కూళ్లను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. విద్యా వ్యవస్థలో కొత్త ట్రెండ్‌ను అవలంబించాలని, క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్‌ పిలుపునిచ్చారు.

హోమ్ గార్డుల నుంచి ఎస్పీ ర్యాంక్ వరకు సిబ్బంది కేటగిరీ ఆధారంగా ఫీజు నిర్మాణం ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ నేతృత్వంలోని అధికారుల బృందం గత రెండు నెలలుగా ఈ పాఠశాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసింది. అన్ని ప్రభుత్వ అనుమతులు, లీజు డీడ్‌లు, ఎంఓయూలు, ప్రిన్సిపాల్, సీనియర్ అధికారులు, ఉపాధ్యాయుల నియామకం, ప్రాథమిక మౌలిక సదుపాయాల పనులు పురోగతిలో ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.