నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈ స్కీంలో చేరితే కేంద్రం నుంచి 3.75 లక్షలు.. డబ్బుకు డబ్బు.. ఉపాధికి ఉపాధి..

|

Mar 17, 2021 | 8:22 PM

Soil Health Card Scheme : నిరుద్యోగ యువకులకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. వ్యవసాయ రంగంలోనే

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈ స్కీంలో చేరితే కేంద్రం నుంచి 3.75 లక్షలు.. డబ్బుకు డబ్బు.. ఉపాధికి ఉపాధి..
Soil Health Card Scheme
Follow us on

Soil Health Card Scheme : నిరుద్యోగ యువకులకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. వ్యవసాయ రంగంలోనే వ్యాపారం చేయాలనుకునేవారికి ఇది సరిగ్గా సరిపోతుంది. ఉపాధి కోసం వెతుకుతున్న యువతకు ఈ స్కీం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో చేరి డబ్బు, ఉపాధి రెండు పొందవచ్చు. అంతేకాకుండా గ్రామాల్లో ఉంటూ వేర్వేరు పనులు చేసేవారికి ఈ బిజినెస్ బాగా సూటవుతుంది. ఈ పథంక ఏంటి దీనిద్వారా డబ్బు ఎలా సంపాదించాలనే విషయం గురంచి ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తవానికి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకానికి సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అని పేరు. ఈ పథకం ద్వారా గ్రామ స్థాయిలో మినీ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, ఆపై ఈ ల్యాబ్ ద్వారా మంచి డబ్బు సంపాదించవచ్చు. దేశంలోని రైతు కుటుంబాల సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం ప్రయోగశాలలు చాలా తక్కువ. అందువల్ల, ఇందులో ఉపాధికి పెద్ద అవకాశాలు ఉన్నాయి.

ఇందులో భాగంఆ పొలం, నేల పరీక్షలు చేస్తారు. ఇలా చేయడం వల్ల నేలకు ఏం కావాలో తెలుస్తుంది. మట్టి నమూనా, పరీక్షలు మరియు నేల ఆరోగ్య కార్డును అందించడానికి ప్రభుత్వం ప్రతి నమూనాకు 300 అందిస్తోంది. ఇక్కడ, మట్టిని పరిశీలించిన తరువాత, సాగు సమయంలో మీరు ఎంత ఎరువు వేయాలి మరియు ఏ పంటను పండించాలో తెలుస్తుంది. దీనితో పాటు ఎరువులు మొదలైన వాటి గురించి ఇంకా చాలా సమాచారం తెలుసుకోవచ్చు.

ఈ పథకం ద్వారా, 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల గ్రామీణ యువత ఈ ప్రయోగశాలను ప్రారంభించవచ్చు. దీంతో పాటు అగ్రి క్లినిక్, వ్యవసాయ వ్యవస్థాపక శిక్షణతో సైన్స్ సబ్జెక్టుతో మెట్రిక్యులేషన్ కలిగి ఉండాలి.అయితే ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడానికి 5 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. కానీ, మీరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే, దాని డబ్బులో 75 శాతం మీరు ప్రభుత్వం నుంచి పొందుతారు. అంటే ప్రభుత్వం మీకు 3.75 లక్షల రూపాయలు ఇస్తుంది. దీని తరువాత, మీరు 1 లక్ష 25 వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో, మీరు సంపాదించడం గురించి మాట్లాడితే, మీరు దాని నుంచి మంచిగా సంపాదించవచ్చు.

ప్రయోగశాల నిర్మించాలనుకునే యువకులు, రైతులు లేదా ఇతర సంస్థలు జిల్లా వ్యవసాయ డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ లేదా అతని కార్యాలయంలోసంప్రదించవచ్చు. దీని కోసం, మీరు agricoop.nic.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. కిసాన్ కాల్ సెంటర్ (1800-180-1551) ని సంప్రదించడం ద్వారా మరింత సమాచారం పొందవచ్చు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులో, ప్రయోగశాల నడపడానికి పరీక్ష యంత్రాలు, రసాయనాలు మరియు ఇతర అవసరమైన వస్తువులను కొనడానికి 2.5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, జీపీఎస్ కొనుగోలుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది.

West Godavari Crime: పశ్చిమగోదావరి జిల్లాలో ఖతర్నాక్ దొంగలు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌నే దోచేశారు

‘ఆప్ ఇతర రాష్ట్రాల్లో బలపడుతుంటే బీజేపీ భయపడుతోంది’, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపాటు