సింగరేణిలో 558 ఉద్యోగాలకు ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ సోమవారం (జనవరి 30) తెలిపారు. కొత్తగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. మొత్తం పోస్టుల్లో 277 ఉద్యోగాలు నిరుద్యోగుల ద్వారా భర్తీ చేస్తారు. అందుకు రాతపరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. మిగిలిన 281 పోస్టులను అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేస్తామని ఆయన తెలిపారు.
పోస్టుల వివరాలు..
అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేసే పోస్టుల వివరాలు..
అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ 2 గ్రేడ్-ఈ అండ్ ఎం) పోస్టులు: 30
జూనియర్ ఇంజినీర్ (ఈ 1 గ్రేడ్-ఈ అండ్ ఎం) పోస్టులు: 20
అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ 2 గ్రేడ్-సివిల్) పోస్టులు: 4
జూనియర్ ఇంజినీర్ (ఈ 1 గ్రేడ్-సివిల్) పోస్టులు: 4
వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైనీ (ఈ 1 గ్రేడ్) పోస్టులు: 11
ప్రోగ్రామర్ ట్రైనీ (ఈ 1 గ్రేడ్) పోస్టులు: 4
జూనియర్ కెమిస్ట్ లేదా జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు: 20