
దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో 2025 సంవత్సరానికి సంబంధించి ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) నోటిఫికేన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ పబ్లిసిటీ న్స్పెక్టర్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ తదితర మొత్తం 312 పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలవగా.. మరో రెండు రోజుల్లో అప్లికేషన్లు ముగియనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు జనవరి 29, 2026వ తేదీ రాత్రి 11.59 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది.
ఈ పోస్టులను అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్పూర్, కోల్కతా, ముంబయి, పట్నా, ప్రయాగ్రాజ్.. ఆర్ఆర్బీ రీజియన్లలో భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్, లా డిగ్రీ, సంబంధిత విభాగాల్లో డిప్లొమా, పీజీ డిప్లొమా, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్మెన్/ ఈబీసీ/ మైనారిటీ అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. సింగిల్ స్టేజ్ సీబీటీ, ట్రాన్స్లేషన్ టెస్ట్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.19,000, జూనియర్ ట్రాన్స్లేటర్, ఇన్స్పెక్టర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు రూ.35,400, ఇతర పోస్టులకు రూ.44,900 చొప్పున జీతంగా చెల్లిస్తారు.
ఆర్ఆర్బీ అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.