AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Polycet: ఈ నెల 29న ఏపీ పాలిసెట్.. టైమ్ దాటితే నో ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్ లో పాలిసెట్ పరీక్షలను ఈ నెల 29న నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షను ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ పరీక్షకు...

AP Polycet: ఈ నెల 29న ఏపీ పాలిసెట్.. టైమ్ దాటితే నో ఎంట్రీ
Exam
Ganesh Mudavath
|

Updated on: May 27, 2022 | 9:47 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో పాలిసెట్ పరీక్షలను ఈ నెల 29న నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షను ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ పరీక్షకు 1.37 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 404 సెంటర్లలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాటు పూర్తి చేశామని చెప్పారు. అభ్యర్థులను ఉదయం 10 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక ఎవరినీ అనుమతించమని స్పష్టం చేశారు. పది రోజుల్లో ప్రవేశ పరీక్ష ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు. మూడేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (AP SBTET) అధికారిక వెబ్‌సైట్ polycetap.nic.inలో హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా ఏపీ పాలీసెట్‌ 2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 11న ప్రారంభమయ్యి, మే 18 వరకు కొనసాగింది. ఏపీ పాలిసెట్ ప్రవేశ పరీక్ష మే 29న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో జరగనుంది.