భారత్ ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్.. 125 ఐటీ ప్రొఫెషనల్స్, ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు..
భారత్ ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్.. 125 ఐటీ ప్రొఫెషనల్స్, ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి 30 నుంచి 62 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్లైన్ విధానంలో నవంబర్ 7, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, స్కిల్ టెస్ట్, అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నోటిఫికేషన్లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ పోస్టులు: 36
సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ పోస్టులు: 4
రిస్క్ అనలిస్ట్ పోస్టులు: 10
నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు: 2
పవర్ అండ్ ఎనర్జీ సెక్టార్ lT & OT సెక్యూరిటీ కన్సల్టెంట్ పోస్టులు:3