NPCIL Recruitment 2022: ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులకు నేటితో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన అణుశక్తినగర్‌ ముంబాయిలోని న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (NPCIL)లో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల (Executive Trainee Posts)లకు దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి రోజు..

NPCIL Recruitment 2022: ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులకు నేటితో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Npcil

Updated on: Apr 28, 2022 | 3:19 PM

NPCIL Executive Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన అణుశక్తినగర్‌ ముంబాయిలోని న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (NPCIL)లో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల (Executive Trainee Posts)లకు దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి రోజు. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండానే అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 225

పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • మెకానికల్‌: 87
  • కెమికల్‌ష్ట్ర 49
  • ఎలక్ట్రికల్‌: 31
  • ఎలక్ట్రానిక్స్‌: 13
  • ఇన్‌స్ట్రుమెంటేషన్‌: 12
  • సివిల్‌: 33

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 26 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజనీరింగ్‌)/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గేట్‌ 2020/2021/2022 స్కోర్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: గేట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు: 2022, జూన్‌ 13 నుంచి 25 తేదీల్లో జరుగుతాయి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

UPSC AE Recruitment 2022: మరికొన్ని గంటల్లోనే ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ.. ఇంజనీరింగ్ చదివినవారు అర్హులు!