Scholarship: బీడీఎస్‌ విద్యార్థులకు బంపరాఫర్‌.. రూ. 2 లక్షల స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం. పూర్తి వివరాలు..

|

Mar 03, 2023 | 2:52 PM

ట్యాలెంట్‌ ఉండి ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడే వారి కోసం కీల్‌ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్‌ స్కాలర్‌ షిప్‌ అందిస్తోంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయంతోపాటు, మెటర్ షిప్, కెరీర్ గైడెన్స్‌లను అందిస్తోంది. ఇంటర్‌ పూర్తి చేసి...

Scholarship: బీడీఎస్‌ విద్యార్థులకు బంపరాఫర్‌.. రూ. 2 లక్షల స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం. పూర్తి వివరాలు..
Scholarship
Follow us on

ట్యాలెంట్‌ ఉండి ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడే వారి కోసం కీల్‌ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్‌ స్కాలర్‌ షిప్‌ అందిస్తోంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయంతోపాటు, మెటర్ షిప్, కెరీర్ గైడెన్స్‌లను అందిస్తోంది. ఇంటర్‌ పూర్తి చేసి బీడిఎస్‌ సీటు సాధించిన వారు ఈ స్కాలర్‌ షిప్‌పొందడానికి అర్హులు. ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోవాలనుకునే వారు 60 శాతం మార్కులతో 12వ తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థలో బీడీఎస్‌ అడ్మిషన్ తీసుకుని ఉండాలి.

అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ. 5 లక్షలకు మించరాదు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాకిరి రూ. 50,000 చొప్పున నాలుగేళ్ల పాటు అందిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్, గుర్తింపు కార్డు, ఆదాయ ధ్రువీకరణ, 12 వ తరగతి మార్క్స్ షీట్, అడ్మిషన్ లెటర్ లేదా ఫీజు రిసిప్ట్ /బోనఫైడ్ వంటి డాక్యుమెంట్స్‌ అవసరం ఉంటాయి. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31ని చివరి తేదీగా నిర్ణయించారు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం కీప్‌ ఇండియా స్మైలింగ్ ఫైండేషనల్ స్కాలర్‌షిప్‌ అండ్‌ మెంటర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ బీడీఎస్‌ కోర్స్‌ 2022-23 లింక్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం అక్కడ కనిపించే అప్లై అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. వెంటనే ఫోన్‌ నెంబర్‌ లేదా మెయిల్‌ ఐడీ ద్వారా రిజిస్టర్‌ అవ్వాల్సి ఉంటుంది. చివరిగా సంబంధిత వివరాలను ఎంటర్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..