
హైదరాబాద్, మే 16: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష 2 పేపర్లకు ఉంటుంది. రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో పేపర్ పరీక్షలు జరుగుతాయి. ఈ రెండు పేపర్లను అభ్యర్ధులు రాయవల్సి ఉంటుంది. విద్యార్థుల్లోని లోతైన సబ్జెక్ట్ నాలెడ్జ్, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించేలా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్షకు గంట ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
అభ్యర్ధులు తమతోపాటు అడ్మిట్ కార్డు, ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డు, 2 పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, పెన్నులు-పెన్సిల్ మాత్రమే అనుమతిస్తారు. ఎలక్ర్టిక్ గాడ్జెట్లు, జామిండ్రీ బాక్స్లు, ఎరైజర్లు, రైటింగ్ ప్యాడ్, గాగుల్స్, హ్యాంగ్ బ్యాగులు వంటి వాటిని అనుమతించరు. అలాగే ఎలాంటి లోహ ఆభరణాలను కూడా ధరించి పరీక్ష కేంద్రంలోకి వెళ్లకూడదు. పెద్ద బటన్లు ఉన్న దుస్తులు ధరించకూడదు. చెప్పులు వంటి తెరచి ఉన్న పాదరక్షలు మాత్రమే ధరించాలి. పరీక్ష ఇంగ్లిష్, హిందీ రెండు మాద్యమాల్లో ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అభ్యర్ధులు జాగ్రత్తగా ప్రశ్నలకు జవాబులు గుర్తించవల్సి ఉంటుంది.
గత ఏడాది అడ్వాన్స్డ్లో మొత్తం 54,378 మందికి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. 2025-26లో దేశ వ్యాప్తంగా 18,160 ఐఐటీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈసారి మరో 300 పెరిగే అవకాశం ఉంది. బెంగళూరులోని ఐఐఎస్సీ కూడా జోసా కౌన్సెలింగ్లో చేరడంతో అదనంగా సీట్లు పెరిగాయి. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు నుంచే జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. జూన్ 1 జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలవుతాయి. ఇక జూన్ 2వ తేదీ నుంచి జోసా కౌన్సెలింగ్ మొదలవుతుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.