NEET: నీట్ -2022 ను రీ షెడ్యూల్ చేయండి.. కేంద్రమంత్రికి ఐఎమ్ఏ లేఖ

మే 21 న జరగాల్సిన నీట్ - 2022 పీజీ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కోరుతూ.. కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయా కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) లేఖ రాసింది. గతేడాది జరిగిన నీట్- 2021 పరీక్ష ఐదు నెలల...

NEET: నీట్ -2022 ను రీ షెడ్యూల్ చేయండి.. కేంద్రమంత్రికి ఐఎమ్ఏ లేఖ
Neet
Follow us

|

Updated on: May 12, 2022 | 10:21 AM

మే 21 న జరగాల్సిన నీట్ – 2022 పీజీ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కోరుతూ.. కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయా కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) లేఖ రాసింది. గతేడాది జరిగిన నీట్- 2021 పరీక్ష ఐదు నెలల ఆలస్యంతో సెప్టెంబర్ 2021 న నిర్వహించారని లేఖలో పేర్కొంది. అక్టోబరులో ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ కూడా ఆలస్యంగా జనవరిలో ప్రారంభమైందని లేఖలో వెల్లడించింది. ఆలస్యమైన కౌన్సెలింగ్ షెడ్యూల్ తో ఏప్రిల్ లో జరగాల్సిన నీట్ పీజీ- 2022 మే నెలకు వాయిదా పడింది. దీంతో ఈ సంవత్సరం సీటు పొందలేకపోతే విద్యార్థులకు కష్టతరమవుతుందని తెలిపింది. మరోవైపు.. మే 21 న నిర్వహిస్తున్న నీట్-2022(NEET) ను వాయిదా వేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. గతేడాది నీట్ కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల తదుపరి సెషన్ కు సిద్ధం కావడానికి సమయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాకు లేఖ రాశారు. గతేడాది నీట్ పరీక్ష నిర్వహించడంలో జాప్యం జరిగిందని, సెప్టెంబరు 2021లో ప్రవేశ పరీక్ష నిర్వహించారని లేఖలో తెలిపారు. ఈ ఆలస్యం కారణంగా అభ్యర్థులు వారి కెరీర్‌లో ఒక సంవత్సరం కోల్పోయారని చెప్పారు. ఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి డిమాండ్ వస్తున్నా అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

మెడికల్ ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలనే డిమాండ్ పెరుగుతున్నప్పటికీ.. పోస్ట్ గ్రాడ్యుయేట్ నీట్ పీజీ – 2022 మాత్రం మే 21న నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. శనివారం జరిగిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా హాజరైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నీట్ పీజీ – 2021 పరీక్ష, కౌన్సెలింగ్ ప్రక్రియ రెండూ ఆలస్యమైనందున ఈ సారి సరైన విధానంలో ఎగ్జామ్ నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. గతేడాది కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో.. రాబోయే నీట్ పీజీ – 2022 పరీక్షకు సిద్ధం కావడానికి తగిన సమయం లేదని దేశవ్యాప్తంగా ఉన్న వైద్యవిద్యార్థులు అంటున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

500 Rupee Note: అలా ఉంటే అది నకిలీ నోటా.. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన పీఐబీ..

రామ్ చరణ్ సినిమాకు తప్పని లీకుల బెడద !! ఆర్సీ 15 నుంచి మరో వీడియో లీక్ !!

Philippines: ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడిగా నియంత కుమారుడు.. జూనియర్‌ మార్కోస్‌ ఘన విజయం..

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?