AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET: నీట్ -2022 ను రీ షెడ్యూల్ చేయండి.. కేంద్రమంత్రికి ఐఎమ్ఏ లేఖ

మే 21 న జరగాల్సిన నీట్ - 2022 పీజీ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కోరుతూ.. కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయా కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) లేఖ రాసింది. గతేడాది జరిగిన నీట్- 2021 పరీక్ష ఐదు నెలల...

NEET: నీట్ -2022 ను రీ షెడ్యూల్ చేయండి.. కేంద్రమంత్రికి ఐఎమ్ఏ లేఖ
Neet
Ganesh Mudavath
|

Updated on: May 12, 2022 | 10:21 AM

Share

మే 21 న జరగాల్సిన నీట్ – 2022 పీజీ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కోరుతూ.. కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయా కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) లేఖ రాసింది. గతేడాది జరిగిన నీట్- 2021 పరీక్ష ఐదు నెలల ఆలస్యంతో సెప్టెంబర్ 2021 న నిర్వహించారని లేఖలో పేర్కొంది. అక్టోబరులో ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ కూడా ఆలస్యంగా జనవరిలో ప్రారంభమైందని లేఖలో వెల్లడించింది. ఆలస్యమైన కౌన్సెలింగ్ షెడ్యూల్ తో ఏప్రిల్ లో జరగాల్సిన నీట్ పీజీ- 2022 మే నెలకు వాయిదా పడింది. దీంతో ఈ సంవత్సరం సీటు పొందలేకపోతే విద్యార్థులకు కష్టతరమవుతుందని తెలిపింది. మరోవైపు.. మే 21 న నిర్వహిస్తున్న నీట్-2022(NEET) ను వాయిదా వేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. గతేడాది నీట్ కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల తదుపరి సెషన్ కు సిద్ధం కావడానికి సమయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాకు లేఖ రాశారు. గతేడాది నీట్ పరీక్ష నిర్వహించడంలో జాప్యం జరిగిందని, సెప్టెంబరు 2021లో ప్రవేశ పరీక్ష నిర్వహించారని లేఖలో తెలిపారు. ఈ ఆలస్యం కారణంగా అభ్యర్థులు వారి కెరీర్‌లో ఒక సంవత్సరం కోల్పోయారని చెప్పారు. ఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి డిమాండ్ వస్తున్నా అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

మెడికల్ ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలనే డిమాండ్ పెరుగుతున్నప్పటికీ.. పోస్ట్ గ్రాడ్యుయేట్ నీట్ పీజీ – 2022 మాత్రం మే 21న నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. శనివారం జరిగిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా హాజరైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నీట్ పీజీ – 2021 పరీక్ష, కౌన్సెలింగ్ ప్రక్రియ రెండూ ఆలస్యమైనందున ఈ సారి సరైన విధానంలో ఎగ్జామ్ నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. గతేడాది కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో.. రాబోయే నీట్ పీజీ – 2022 పరీక్షకు సిద్ధం కావడానికి తగిన సమయం లేదని దేశవ్యాప్తంగా ఉన్న వైద్యవిద్యార్థులు అంటున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

500 Rupee Note: అలా ఉంటే అది నకిలీ నోటా.. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన పీఐబీ..

రామ్ చరణ్ సినిమాకు తప్పని లీకుల బెడద !! ఆర్సీ 15 నుంచి మరో వీడియో లీక్ !!

Philippines: ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడిగా నియంత కుమారుడు.. జూనియర్‌ మార్కోస్‌ ఘన విజయం..

పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162