AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET: నీట్ -2022 ను రీ షెడ్యూల్ చేయండి.. కేంద్రమంత్రికి ఐఎమ్ఏ లేఖ

మే 21 న జరగాల్సిన నీట్ - 2022 పీజీ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కోరుతూ.. కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయా కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) లేఖ రాసింది. గతేడాది జరిగిన నీట్- 2021 పరీక్ష ఐదు నెలల...

NEET: నీట్ -2022 ను రీ షెడ్యూల్ చేయండి.. కేంద్రమంత్రికి ఐఎమ్ఏ లేఖ
Neet
Ganesh Mudavath
|

Updated on: May 12, 2022 | 10:21 AM

Share

మే 21 న జరగాల్సిన నీట్ – 2022 పీజీ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కోరుతూ.. కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయా కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) లేఖ రాసింది. గతేడాది జరిగిన నీట్- 2021 పరీక్ష ఐదు నెలల ఆలస్యంతో సెప్టెంబర్ 2021 న నిర్వహించారని లేఖలో పేర్కొంది. అక్టోబరులో ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ కూడా ఆలస్యంగా జనవరిలో ప్రారంభమైందని లేఖలో వెల్లడించింది. ఆలస్యమైన కౌన్సెలింగ్ షెడ్యూల్ తో ఏప్రిల్ లో జరగాల్సిన నీట్ పీజీ- 2022 మే నెలకు వాయిదా పడింది. దీంతో ఈ సంవత్సరం సీటు పొందలేకపోతే విద్యార్థులకు కష్టతరమవుతుందని తెలిపింది. మరోవైపు.. మే 21 న నిర్వహిస్తున్న నీట్-2022(NEET) ను వాయిదా వేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. గతేడాది నీట్ కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల తదుపరి సెషన్ కు సిద్ధం కావడానికి సమయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాకు లేఖ రాశారు. గతేడాది నీట్ పరీక్ష నిర్వహించడంలో జాప్యం జరిగిందని, సెప్టెంబరు 2021లో ప్రవేశ పరీక్ష నిర్వహించారని లేఖలో తెలిపారు. ఈ ఆలస్యం కారణంగా అభ్యర్థులు వారి కెరీర్‌లో ఒక సంవత్సరం కోల్పోయారని చెప్పారు. ఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి డిమాండ్ వస్తున్నా అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

మెడికల్ ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలనే డిమాండ్ పెరుగుతున్నప్పటికీ.. పోస్ట్ గ్రాడ్యుయేట్ నీట్ పీజీ – 2022 మాత్రం మే 21న నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. శనివారం జరిగిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా హాజరైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నీట్ పీజీ – 2021 పరీక్ష, కౌన్సెలింగ్ ప్రక్రియ రెండూ ఆలస్యమైనందున ఈ సారి సరైన విధానంలో ఎగ్జామ్ నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. గతేడాది కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో.. రాబోయే నీట్ పీజీ – 2022 పరీక్షకు సిద్ధం కావడానికి తగిన సమయం లేదని దేశవ్యాప్తంగా ఉన్న వైద్యవిద్యార్థులు అంటున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

500 Rupee Note: అలా ఉంటే అది నకిలీ నోటా.. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన పీఐబీ..

రామ్ చరణ్ సినిమాకు తప్పని లీకుల బెడద !! ఆర్సీ 15 నుంచి మరో వీడియో లీక్ !!

Philippines: ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడిగా నియంత కుమారుడు.. జూనియర్‌ మార్కోస్‌ ఘన విజయం..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!