Telugu News Education Career Jobs Indian Medical Association writes letter to Union Minister Mansukh Mandavia about rescheduling of NEET 2022 PG exam
NEET: నీట్ -2022 ను రీ షెడ్యూల్ చేయండి.. కేంద్రమంత్రికి ఐఎమ్ఏ లేఖ
మే 21 న జరగాల్సిన నీట్ - 2022 పీజీ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కోరుతూ.. కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయా కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) లేఖ రాసింది. గతేడాది జరిగిన నీట్- 2021 పరీక్ష ఐదు నెలల...
మే 21 న జరగాల్సిన నీట్ – 2022 పీజీ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కోరుతూ.. కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయా కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) లేఖ రాసింది. గతేడాది జరిగిన నీట్- 2021 పరీక్ష ఐదు నెలల ఆలస్యంతో సెప్టెంబర్ 2021 న నిర్వహించారని లేఖలో పేర్కొంది. అక్టోబరులో ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ కూడా ఆలస్యంగా జనవరిలో ప్రారంభమైందని లేఖలో వెల్లడించింది. ఆలస్యమైన కౌన్సెలింగ్ షెడ్యూల్ తో ఏప్రిల్ లో జరగాల్సిన నీట్ పీజీ- 2022 మే నెలకు వాయిదా పడింది. దీంతో ఈ సంవత్సరం సీటు పొందలేకపోతే విద్యార్థులకు కష్టతరమవుతుందని తెలిపింది. మరోవైపు.. మే 21 న నిర్వహిస్తున్న నీట్-2022(NEET) ను వాయిదా వేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. గతేడాది నీట్ కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల తదుపరి సెషన్ కు సిద్ధం కావడానికి సమయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాకు లేఖ రాశారు. గతేడాది నీట్ పరీక్ష నిర్వహించడంలో జాప్యం జరిగిందని, సెప్టెంబరు 2021లో ప్రవేశ పరీక్ష నిర్వహించారని లేఖలో తెలిపారు. ఈ ఆలస్యం కారణంగా అభ్యర్థులు వారి కెరీర్లో ఒక సంవత్సరం కోల్పోయారని చెప్పారు. ఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి డిమాండ్ వస్తున్నా అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
Indian Medical Association (IMA) wrote a letter to Union Health Minister Mansukh Mandaviya to “reschedule the NEET PG exam scheduled for 21st May 2022” pic.twitter.com/Y9gFUImrgM
మెడికల్ ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలనే డిమాండ్ పెరుగుతున్నప్పటికీ.. పోస్ట్ గ్రాడ్యుయేట్ నీట్ పీజీ – 2022 మాత్రం మే 21న నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. శనివారం జరిగిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా హాజరైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నీట్ పీజీ – 2021 పరీక్ష, కౌన్సెలింగ్ ప్రక్రియ రెండూ ఆలస్యమైనందున ఈ సారి సరైన విధానంలో ఎగ్జామ్ నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. గతేడాది కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో.. రాబోయే నీట్ పీజీ – 2022 పరీక్షకు సిద్ధం కావడానికి తగిన సమయం లేదని దేశవ్యాప్తంగా ఉన్న వైద్యవిద్యార్థులు అంటున్నారు.