BSc Admissions: బీఎస్సీ నర్సింగ్‌ కన్వీనర్‌ కోటా ప్రవేశాలకు దరఖాస్తులు..సెప్టెంబర్ 17తో ముగుస్తున్న రిజిస్ట్రేషన్లు

|

Sep 12, 2024 | 8:02 AM

ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అందుబాటులో ఉన్న నాలుగేళ్ల, రెండేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కన్వీనర్‌ కోటా సీట్లలో ప్రవేశానికి సంబంధించి విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏపీఈఏపీసెట్‌ 2024లో ర్యాంకు సాధించిన అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు..

BSc Admissions: బీఎస్సీ నర్సింగ్‌ కన్వీనర్‌ కోటా ప్రవేశాలకు దరఖాస్తులు..సెప్టెంబర్ 17తో ముగుస్తున్న రిజిస్ట్రేషన్లు
BSc Admissions
Follow us on

అమరావతి, సెప్టెంబర్‌ 12: ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అందుబాటులో ఉన్న నాలుగేళ్ల, రెండేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కన్వీనర్‌ కోటా సీట్లలో ప్రవేశానికి సంబంధించి విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏపీఈఏపీసెట్‌ 2024లో ర్యాంకు సాధించిన అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 17వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఓసీ అభ్యర్ధులు రూ.2,360, బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.1,888 బ్యాంకు ద్వారా రసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఏవైనా సందేహాలు, అభ్యంతరాలుంటే 89787 80501, 79977 10168 ఫోన్‌ నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొంది. సాంకేతిక సమస్యలు తలెత్తితే 90007 80707కు ఫోన్‌ చేయవచ్చన్నారు. అలాగే 2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రైవేట్‌ వైద్య, దంత వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి సంబంధించి తాత్కాలిక ప్రాధాన్యత క్రమం విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలు ఉన్న వారు ఈ రోజు గడువు సమయం ముగిసేలోగా యూనివర్సిటీకి తెలియపర్చాలని పేర్కొంది.

తెలంగాణ పీజీఈసెట్‌ 2024 తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి.. సెప్టెంబర్‌ 23 నుంచి తరగతులు

తెలంగాణలో ఎంఈ, ఎంటెక్‌, ఎంఆర్క్‌, ఎంఫార్మసీ, ఫార్మ్‌-డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘టీఎస్ పీజీఈసెట్‌ 2024’ తొలి విడత కౌన్సెలింగ్‌‌ ముగిసింది. తొలి విడతలో వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరిగింది. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్ధులు సెప్టెంబర్‌ 19వ తేదీలోపు సెల్ఫ్ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఇక సెప్టెంబర్‌ 23వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రవేశాల కన్వీనర్‌ రమేష్‌బాబు వెల్లడించారు. ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.