AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుంతకల్లు కుర్రోడి సత్తా.. Btech చదువుతుండగానే రూ.5 కోట్ల ప్యాకేజీతో అమెరికాలో జాబ్!

గుంతకల్లుకు చెందిన ఓ కుర్రాడు ఏకంగా రూ.5 కోట్ల ప్యాకేజీతో అమెరికాలోని ఆప్టివర్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో కొలువు దక్కించుకున్నాడు. బీటెక్‌ ఫైనల్ ఇయర్‌ చదువుతున్న సదరు విద్యార్ధి చదువు పూర్తికాకుండానే ఇంత పెద్ద భారీ ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపిక కావడం విశేషం..

గుంతకల్లు కుర్రోడి సత్తా.. Btech చదువుతుండగానే రూ.5 కోట్ల ప్యాకేజీతో అమెరికాలో జాబ్!
Btech Student Secured Job At Optiver Software Company In America
Srilakshmi C
|

Updated on: Sep 10, 2025 | 11:59 AM

Share

గుంతకల్లు, సెప్టెంబర్‌ 10: రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఓ కుర్రాడు ఏకంగా రూ.5 కోట్ల ప్యాకేజీతో అమెరికాలోని ఆప్టివర్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో కొలువు దక్కించుకున్నాడు. బీటెక్‌ ఫైనల్ ఇయర్‌ చదువుతున్న సదరు విద్యార్ధి చదువు పూర్తికాకుండానే ఇంత పెద్ద భారీ ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపిక కావడం విశేషం. గుంతకల్లుకు చెందిన రమేశ్, వాసవి దంపతుల కుమారుడు సాయి సాకేత్‌. పదేళ్ల కిందట వీరు అమెరికాకు వెళ్లారు. అక్కడే నివాసం ఉంటున్న వీరు తమ కుమారుడు సాయి సాకేత్‌ను అమెరికాలోనే చదివిస్తున్నారు. అక్కడ బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతుండగానే సాయిసాకేత్‌కు రూ.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో అమెరికాలోని ఆప్టివర్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో కొలువకు అర్హత సాధించాడు.

ఆప్టివర్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇటీవల నిర్వహించిన ఎంపిక పరీక్షకు సాయి సాకేత్‌ కూడా హాజరయ్యాడు. ఈ పరీక్షలో సాఫ్ట్‌వేర్, బిజినెస్, గణితం విభాగాల్లో అత్యంత ప్రతిభను చూపినందుకుగానూ ఆ సంస్థ సాయి సాకేత్‌ను ఉద్యోగానికి ఎంపిక చేసింది. ఇందులో భాగంగా 2 నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ చేయవల్సి ఉంటుంది. దీనికి రూ.కోటి వేతనం అందుకోనున్నాడు. ఇక కోర్సు పూర్తి కాగానే ఏడాదికి రూ.5 కోట్ల చొప్పున ప్యాకేజీ ఇవ్వడానికి సదరు కంపెనీ అంగీకరించినట్లు సాకేత్ కుటుంబ సభ్యులు తెలిపారు.

సెప్టెంబర్‌ 11 నుంచి ఏపీ ఫార్మసీ మొదటి విడత కౌన్సెలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ ఫార్మసీ (బైపీసీ స్ట్రీమ్‌) కౌన్పెలింగ్‌కు సంబంధించిన మొదటి, రెండో విడతల షెడ్యూల్‌లను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. సెప్టెంబరు 11 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 12 నుంచి 17 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. సెప్టెంబర్‌ 13 నుంచి 18 వరకు వెబ్‌ ఐచ్ఛికాల నమోదు, 19న ఐచ్ఛికాల మార్పు, 21న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్‌ 21 నుంచి 23లోపు ఆయా కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. రెండో విడత బైపీసీ స్ట్రీమ్‌ కౌన్సెలింగ్‌లో సెప్టెంబరు 24, 25 తేదీల్లో ఉంటుంది. 28న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబరు 8లోపు ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సండే స్పెషల్.. ఫిష్ కుర్మా ఇలా వండితే తినేకొద్దీ తినాలనిపిస్తుంది
సండే స్పెషల్.. ఫిష్ కుర్మా ఇలా వండితే తినేకొద్దీ తినాలనిపిస్తుంది
ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీకి వాడే ప్లాస్టిక్‌ గిన్నెల్లో కాలకూట విషం
ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీకి వాడే ప్లాస్టిక్‌ గిన్నెల్లో కాలకూట విషం
ఎంత డబ్బు సంపాదించినా.. నిలవడం లేదా..? ఈ పక్షుల ఫోటోలు ఇంట్లో..
ఎంత డబ్బు సంపాదించినా.. నిలవడం లేదా..? ఈ పక్షుల ఫోటోలు ఇంట్లో..
బ్రాయిలర్ vs నాటు కోడి.. ఇందులో ఏది బెస్ట్..
బ్రాయిలర్ vs నాటు కోడి.. ఇందులో ఏది బెస్ట్..
ట్రాఫిక్ కష్టాలకు టాటా.. బెజవాడ వాసులకు భలే గుడ్ న్యూస్..
ట్రాఫిక్ కష్టాలకు టాటా.. బెజవాడ వాసులకు భలే గుడ్ న్యూస్..
మిత్రమా.. సమ్మర్‌ వచ్చేస్తోంది.. ఏసీ స్కామ్‌ గురించి మీకు తెలుసా?
మిత్రమా.. సమ్మర్‌ వచ్చేస్తోంది.. ఏసీ స్కామ్‌ గురించి మీకు తెలుసా?
చేపల కూర నుంచి నీచు వాసన పోవట్లేదా?.. ఇలా కడిగితే సరి
చేపల కూర నుంచి నీచు వాసన పోవట్లేదా?.. ఇలా కడిగితే సరి
14ఏళ్లకే హీరోయిన్.. 300లకు పైగా సినిమాలు..
14ఏళ్లకే హీరోయిన్.. 300లకు పైగా సినిమాలు..
అయ్యో నా పతి దేవుడ్ని కిడ్నాప్ చేశారంటూ భార్య వర్రీ..
అయ్యో నా పతి దేవుడ్ని కిడ్నాప్ చేశారంటూ భార్య వర్రీ..
టీ20 వరల్డ్ కప్ సెమీస్‌కు వెళ్లేది ఈ జట్లే..గ్రోక్ షాకింగ్ జోస్యం
టీ20 వరల్డ్ కప్ సెమీస్‌కు వెళ్లేది ఈ జట్లే..గ్రోక్ షాకింగ్ జోస్యం