AP Inter Supplementary Exams 2022: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జులైలో..?

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను (Inter Supplementary Exams) జులై రెండో వారంలో నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు (APBIES) ..

AP Inter Supplementary Exams 2022: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జులైలో..?
Nter Supplementary Exams

Updated on: May 12, 2022 | 8:00 AM

AP Inter Supplementary Exams time table 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మే 6 ప్రారంభమైన ఇంటర్మీడియట్‌ పరీక్షలు మే 24 వరకు జరగనున్నాయి. ఈ ఏడాది ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్, సెకండ్‌ ఇయర్లకు కలిపి మొత్తం 9,14,423 మంది విద్యార్ధులు పరీక్షలు రాస్తున్నారు. వృత్తి విద్య పరీక్షలను 87,435 మంది రాస్తున్నారు. రాష్ట్రంలో 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల అనంతరం ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను (Inter Supplementary Exams) జులై రెండో వారంలో నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు (APBIE) ఆలోచిస్తోంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలు మే 24తో ముగుస్తాయి. అనంతరం 20 రోజుల్లో ఫలితాలు విడుదల చేసి, జులై రెండో వారంలో అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశంపై ఇంటర్‌ బోర్డు పరిశీలిస్తోంది.

Also Read:

Summer Tour 2022: దక్షిణ భారతదేశంలో ఈ ఫేమస్‌ బీచ్‌లకు ఎప్పుడైనా వెళ్లారా? ప్రకృతి అందాలకు నెలవులు..