
అమరావతి, ఆగస్ట్ 16: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 ఎంపీసీ స్ట్రీమ్ తుది విడత (Final Phase) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఇంజినీరింగ్ తదితర ఎంపీసీ స్ట్రీమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు తదితర ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్లో పాల్గొనే అభ్యర్థులు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులకు సంబంధించిన వెబ్ ఆప్షన్లను నిర్ణీత గడువులో నమోదు చేయాలి. ఆప్షన్లను మార్చుకునేందుకు ఆగస్టు 23న అవకాశం కల్పించారు.
మరోవైపు AP EAPCET 2026 బైపీసీ స్ట్రీమ్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ కౌన్సెలింగ్లో భాగంగా అభ్యర్థులు ఆగస్టు 20 వరకు రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన, ఫీజు చెల్లింపు ప్రక్రియలను పూర్తి చేసుకోవచ్చు.
అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియలో ప్రతి దశకు సంబంధించిన గడువులను తప్పకుండా పాటించాలి. ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు లేదా సీట్ల కేటాయింపు వంటి కీలక దశల్లో గడువు మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.