
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఈ ప్రవేశ పరీక్షను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమై మే 5వ తేదీతో ముగిసింది. అయితే నోటిఫికేషన్లో ప్రవేశ పరీక్షల తేదీలను మాత్రం పేర్కొనలేదు. దీంతో తాజా ఈ పరీక్షల షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్యాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2025 పరీక్షలు జూన్ 9 నుంచి 12వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో రోజుకు రెండు విడతల్లో ఉదయం, సాయంత్రం నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఏపీ పీజీసెట్-2025 ఎగ్జామినేషన్ షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 17 యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 150కి పైగా పీజీ కోర్సుల్లో ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకే కేటాయిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.