AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP EAPCET 2024 Top Rankers: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల్లో సత్తా చాటిన గుంటూరు విద్యార్ధి.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ ఫలితాలు మంగళవారం (జూన్‌ 11) విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జే శ్యామలరావు ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 3,62,851 మంది విద్యార్ధులు ఈ పరీక్షకు దరఖాస్తు చేయగా, వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు..

AP EAPCET 2024 Top Rankers: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల్లో సత్తా చాటిన గుంటూరు విద్యార్ధి.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే
AP EAPCET 2024 Top Rankers
Srilakshmi C
|

Updated on: Jun 12, 2024 | 8:06 AM

Share

అమరావతి, జూన్‌ 12: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ ఫలితాలు మంగళవారం (జూన్‌ 11) విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జే శ్యామలరావు ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 3,62,851 మంది విద్యార్ధులు ఈ పరీక్షకు దరఖాస్తు చేయగా, వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో 2,58,373 మంది, అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌లలో 80,766 మంది పరీక్షలు రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 16 నుంచి 23 వరకు ఈఏపీసెట్‌ పరీక్షలు జరిగాయి. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 1,95,092 (75.51 శాతం), అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌లలో 70,352 ( 87.11 శాతం) మంది అర్హత సాధించారు. ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25% వెయిటేజీ ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. త్వరలో కౌన్సెలింగ్‌ హెడ్యూల్‌ విడుదల చేయనున్నారు.

ఇంజినీరింగ్ విభాగంలో టాప్‌ 10 ర్యాంకర్లు

  • గుంటూరుకు చెందిన మాకినేని జిష్ణుసాయి 97.0022 మార్కులతో టాప్‌ ర్యాంకు సొంతం చేసుకున్నాడు
  • కర్నూలుకు చెందిన ఎం. సాయి యశ్వంత్‌రెడ్డి 96.8358 మార్కులతో సెకండ్‌ ర్యాంకు పొందాడు
  • ఆదోనికి చెందిన పి.సతీష్‌రెడ్డి 96.4285 మార్కులతో మూడో ర్యాంకు సొంతం చేసుకున్నాడు
  • అనంతపురానికి చెందిన పాలగిరి సతీష్‌రెడ్డి నాలుగో ర్యాంకు
  • గుంటూరుకు చెందిన కోమటినేని మనీశ్‌ చౌదరి ఐదోర్యాంకు
  • తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన ఇప్ప లక్ష్మీనరసింహారెడ్డి ఆరో ర్యాంకు
  • కర్నూలుకు చెందిన గొల్ల లేఖాహర్ష ఏడో ర్యాంకు
  • అనంతపురానికి చెందిన పుట్టి కుశాల్‌కుమార్‌ ఎనిమిదో ర్యాంకు
  • హనుమకొండకు చెందిన పరమారాధ్యులు సుశాంత్‌కు తొమ్మిదో ర్యాంకు
  • ప్రకాశం జిల్లాకు చెందిన కొమిరిశెట్టి ప్రభాస్‌కు పదో ర్యాంకు

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో టాప్‌ 10 ర్యాంకర్లు

  • ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి యెల్లు శ్రీశాంత్‌రెడ్డి సత్తా చాటాడు. అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో శ్రీశాంత్‌రెడ్డి ప్రథమ ర్యాంకు సాధించాడు.
  • శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన పూల దివ్య తేజ 92.9278 మార్కులతో సెకండ్‌ ర్యాంకు
  • తిరుపతికి చెందిన వడ్లపూడి ముకేష్‌ చౌదరి థార్డ్ ర్యాంకు
  • చిత్తూరుకు చెందిన పేర సాత్విక్‌ నాలుగో ర్యాంకు
  • అన్నమయ్య జిల్లాకు చెందిన ఆలోర్‌ ప్రణీత ఐదో ర్యాంకు
  • అనంతపూర్‌కు చెందిన గట్టు భానుతేజ సాయి ఆరో ర్యాంకు
  • నిజాంపేటకు చెందిన పెన్నమడ నీహారిక రెడ్డి ఏడో ర్యాంకు
  • విశాఖపట్నంకు చెందిన సంబంగి మానో అభిరామ్‌ ఎనిమిదో ర్యాంకు
  • విశాఖపట్నంకు చెందిన సరగదం పావని తొమ్మిదో ర్యాంకు
  • పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన నాగుదాసరి రాధా కృష్ణ పదో ర్యాంకు సాధించారు

మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి