న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్.. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 495 కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండిమ్యాన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి/ఐటీఐ/మూడేళ్ల డిప్లొమా/ఇంటర్మీడియట్/గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 28 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఏప్రిల్ 17, 18, 19, 20 తేదీల్లో కింది అడ్రస్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.500లు చెల్లించవల్సి ఉంటుంది. ట్రేడ్టెస్ట్/ పీఈటీ/ పర్సనల్/ వర్చువల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.21,330ల నుంచి రూ.25,980ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
Office of the HRD Department, AI Unity Complex, Pallavaram Cantonment, Chennai -600043.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.