టెలికం కంపెనీలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇక..!

ఇప్పటి వరకు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న టెలికం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. స్పెక్ట్రమ్ చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మోరటోరియం విధిస్తూ.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో టెలికం కంపెనీలకు పెద్ద ఎత్తున ఊరట కల్గినట్లైంది. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్‌లు రూ.42,000 కోట్లకు పైగా స్పెక్ట్రం రుసుము చెల్లించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ టెలికం ఆపరేటర్లలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో […]

టెలికం కంపెనీలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇక..!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 22, 2019 | 12:24 PM

ఇప్పటి వరకు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న టెలికం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. స్పెక్ట్రమ్ చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మోరటోరియం విధిస్తూ.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో టెలికం కంపెనీలకు పెద్ద ఎత్తున ఊరట కల్గినట్లైంది. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్‌లు రూ.42,000 కోట్లకు పైగా స్పెక్ట్రం రుసుము చెల్లించాల్సి ఉంది.

అయితే ప్రస్తుతం ఈ టెలికం ఆపరేటర్లలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. ముఖ్యంగా వోడాఫోన్ తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. పెద్ద ఎత్తున అప్పులు ఉండటంతో.. ఇక కంపెనీ చేతులెత్తేసి దేశం విడిచి వెళ్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దీనికి ముఖ్య కారణం ఇటీవల ఆపరేటర్ల మధ్య నెలకొన్న పోటీ. దీంతో ఈ సంక్షోభంలో వోడాఫోన్, ఎయిర్ టెల్, ఐడియా నష్టాల్లోకి వెళ్లాయి. అదే సమయంలో జియో మాత్రం మంచి లాభాలను గడించింది. అయితే తాజాగా కేంద్రం చేసిన ప్రకటనతో వోడాఫోన్, ఐడియా, ఎయిర్ టెల్ కంపెనీలు ఫుల్ జోష్‌లో ఉన్నాయి.

కేంద్ర క్యాబినెట్ సమావేశం అనంతరం దీనికి సంబంధించి ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఇటీవల టెలికం కంపెనీలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని గమనించి.. సీఓఎస్ సిఫారసులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండేళ్ల పాటు స్పెక్ట్రం వేలం వాయిదాల చెల్లింపులను వాయిదా వేసినట్టు తెలిపారు. దీంతో రాబోయే 2020 – 21, 2021- 22 సంవత్సరాలకు కంపెనీలు స్పెక్ట్రం చెల్లింపులు చెల్లించాల్సిన అవసరం లేదు. తిరిగి 2022-23 సంవత్సరానికి చెల్లించాల్సి ఉంటుంది. మొత్తానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో.. టెలికం కంపెనీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.