ప్రస్తుతం టెలికాం కంపెనీల మధ్య పోటీ భారీగా పెరిగింది. మరీ ముఖ్యంగా టారిఫ్ ధరలు పెంచిన తర్వాత యూజర్లను ఆకట్టుకునే క్రమంలో రకరకాల ప్లాన్స్ను పరిచయం చేస్తున్నాయి సంస్థలు. ఇందులో భాగంగా ఓటీటీ లవర్స్ను టార్గెట్ చేసుకొని కొత్త ప్లాన్స్ను తీసుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా మంచి ప్లాన్తో కస్టమర్లకు అట్రాక్ట్ చేసే పనిలో పడింది. ఇంతకీ ఏంటా ప్లాన్.? దాంతో కలిగే ప్రయోజనాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
రెడ్ఎక్స్ పోస్ట్పెయిడ్ పేరుతో ఈ కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. భారతదేశంలో యూజర్లకు ఈ కొత్త ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిజానికి ఈ ప్లాన్ ఇంతకు ముందే అందుబాటులో ఉండగా ప్రస్తుతం పెరిగిన ఛార్జీల తర్వాత మరికొన్ని కొత్త బెనిఫిట్స్ను యాడ్ చేసింది. వాడాఫోన్ ఐడియా అధికారిక వెబ్సైట్లో ఈ ప్లాన్కు సంబంధించిన వివరాలను అందించారు. ఇదొక పోస్ట్ పెయిడ్ ప్లాన్. ఇంతులో నెలకు రూ. 1201 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కొత్త ప్లాన్ ద్వారా యూజర్లకు అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. అలాగే అన్లిమిటెడ్ డేటా పొందొచ్చు. వీటితో పాటు ప్రతీ రోజూ 100 ఉచిత ఎస్ఎస్ఎస్లు అందిస్తారు. ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్తో ఉచితంగా ఓటీటీలను వీక్షించొచ్చు. నెట్ఫ్లిక్స్ బేసిక్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్స్టార్, సోనీ లివ్ ప్రీమియం, సన్ నెక్ట్స్ వంటి ఐదు ఓటిటి ప్లాట్ ఫామ్స్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు. యూరో కప్ను ఉచితంగా సోనీ లివ్లో చూసే అవకాశం లభిస్తుంది.
వీటితోపాటు మరికొన్ని ఆఫర్లను సైతం అందిస్తున్నారు. ఇందులో ఆరు నెలల పాటు ఉచిత స్విగ్గీ వన్ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. విఐ యాప్ లేదా వెబ్సైట్ నుంచి ఈ ప్లాన్ను ఎంచుకోవచ్చు. ఇక స్విగ్గీ వన్ సబ్స్క్రిప్షన్ ద్వారా రూ .199 కంటే ఎక్కువ ఫుడ్ / ఇన్స్టామార్ట్ ఆర్డర్లపై ఉచిత డెలివరీ, స్విగ్గీ డైనౌట్ / జెనీపై డిస్కౌంట్లు వస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..